బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై తన వంతు ఒత్తిడి తీసుకొస్తానని గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం పిల్లలు ఎండలో, వానలో నిరసన తెలపడం ఒక తల్లిగా తనను కలిచి వేసిందని ఆమె చెప్పారు.
అందువల్లే ఓ అమ్మగా వచ్చి ఇక్కడి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. ఆదివారం నిర్మల్ జిల్లా ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీతో పాటు నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని గవర్నర్ సందర్శించారు. మొదటగా గవర్నర్ నిర్మల్ జిల్లా ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీని గవర్నర్ సందర్శించారు.
ఉదయం వేళ విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. విద్యార్థి వసతి గృహలు, తరగతి గదులు, భోజన శాలలన్నింటినీ పరిశీలించారు. సుమారు నాలుగు గంటల పాటు గవర్నర్ ట్రిపుల్ ఐటీలో గడిపారు. ఆ తర్వాత విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
విద్యార్థుల డిమాండ్లు చాలా సింపుల్ గా ఉన్నాయని చెబుతూ లైబ్రరిలో సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని, 2017 నుంచి విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు లేవని, ట్రిపుల్ ఐటీలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేవని ఆమె విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి క్వాలిటీ భోజనం అందించాలని గవర్నర్ సూచించారు.
అమ్మాయిలకు భద్రత విషయంలో సమస్య ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. సిబ్బంది కొరత కూడా ఉందని, మెస్ ల విషయంలో పిల్లలు సంతోషంగా లేరని గవర్నర్ చెప్పారు. ట్రిపుల్ ఐటీలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఈ సందర్భంగా గవర్నర్ను కోరారు. నాణ్యమైన భోజనం అందడం లేదని, లైబ్రీలో సరైన సౌకర్యాలు లేవని, గత కొన్నేళ్ల నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరగడం లేదని గవర్నర్ దృష్టికి తెచ్చారు.
క్యాంపస్లోని పరిసరాలను గవర్నర్ తమిళిసై తొలుత పరిశీలించారు. విద్యార్థుల వసతిగృహాలు, బాత్రూంలలో వసతులను చూశారు. విద్యార్థులతో కలసి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్లో వండిన వంటకాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. తర్వాత అధికారులతో భేటీ అయ్యారు. ఆపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సుమారు 6 గంటలపాటు వర్సిటీలోనే గడిపారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు మరింత పెరగాలని గవర్నర్ తమిళిసై సూచించారు. నూతన ఆవిష్కరణలతోనే జాతీయ స్థాయిలో పేరు వస్తుందని, పరిశోధనలు అత్యున్నత స్థాయిలో ఉంటే తెలంగాణ యూనివర్సిటీని దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకుళ్లడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.