ప్రముఖ సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ కు నీల్ మోహన్ సీఈవోగా నియమితులయ్యారు. సంస్థకు అత్యధిక కాలం సీఈవోగా పని చేసిన సూసన్ వొజిసికి పదవి నుంచి వైదొలిగారు. దీంతో యూట్యూబ్ యాజమాన్యం నీల్ మోహన్ను కొత్త సీఈవోగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. నీల్ మోహన్ ఇండియన్-అమెరికన్.
నీల్ మోహన్ ప్రస్తుతం ఆ సంస్థలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గాపని చేస్తున్నారు. నీల్ మోహన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2008లో ఆయన గూగుల్లో చేరారు. భారతీయులకు టాప్ కంపెనీల్లో అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తుండడం విశేషం. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ పని చేస్తున్నాను. వీరి సరసన ఇప్పుడు నీల్ మోహన్ చేరారు.
యూట్యూబ్ నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న నీల్మోహన్కు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభినందనలు తెలిపారు. సుసాన్ వొజిసికి సంస్థకు చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన యూట్యూబ్ను అత్యంత విజయవంతంగా ముందుకు నడిపించారని ప్రకటనలో పేర్కొన్నారు.
పదవి నుంచి తప్పుకుంటున్న సూసన్ సంస్థ ఉద్యోగులకు లేఖ రాశారు. కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత ప్రాజెక్ట్లపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. సూసన్ వొజిసికికి సంస్థతో విడదీయరాని అనుబంధం ఉంది. యూట్యూబ్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్లో గత 25ఏళ్లుగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు.
యూట్యూబ్కు తొమ్మిది ఏళ్లుగా ఆయన సీఈవోగా పని చేస్తున్నారు. ఆల్ఫాబెట్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్ సూసన్ సేవలను కొనియాడారు. గూగుల్ చరిత్రలో సూసన్కు ప్రత్యేక స్థానముందన్నారు. సూసన్ సీఈవోగా ఉన్న సమయంలో యూట్యూబ్ అత్యున్న స్థాయికి చేరింది. వారి సారథ్యంలో గతే సంవత్సరం యాడ్స్ ద్వారా యూట్యూబ్ కు 29.2 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది.