Author: Editor's Desk, Tattva News

భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలైన ఆరంభ వేడుకలు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరం వేదికగా మొదలయ్యాయి. ఫుట్‌బాలర్‌ జిదానే ఒలింపిక్‌ టార్చ్‌ పట్టుకుని పరిగెత్తగా..అతన్ని అనుసరిస్తూ కొంత మంది చిన్నారులు పడవలో ప్రయాణించడంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెరతీసినట్లు అయ్యింది.  ఫ్రాన్స్‌ ప్రధాని ఎమాన్యుయెల్‌ మక్రాన్‌, అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్య(ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ అతిథులతో పాటు అభిమానులను చేతులు ఊపుతూ మార్చ్‌పాస్ట్‌కు స్వాగతం పలికారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.  ఫ్యాషన్‌కు పెట్టింది పేరు అయిన పారిస్‌ సంస్కృతిని ప్రతిబింబిస్తూ అంతకుముందు జరిగిన షోలో పలువురు క్రీడా ప్రముఖులు తమదైన శైలిలో దుస్తులు ధరించి ఈఫిల్‌ టవర్‌ ముందు ఫొటోలు ఫోజులు ఇచ్చారు. ఈ పరేడ్‌లో భారత్‌ అథ్లెట్లు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఐదో ఒలింపిక్స్ ఆడబోతున్న టేబుల్ టెన్నిస్…

Read More

పశ్చిమబెంగాల్‌, కేరళలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అసెంబ్లీలో పాస్‌ అయిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్లు పెండింగ్‌లో ఉంచడంపై ఆయా రాష్ర్టాల్లోని టీఎంసీ, ఎల్డీఎఫ్‌ ప్రభుత్వాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం పరిగణనలోకి తీసుకొన్నది.  మూడు వారాల్లోగా పిటిషన్లపై స్పందన తెలియజేయాలని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, పశ్చిమబెంగాల్‌, కేరళ గవర్నర్ల కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. పిటిషన్‌లో కేంద్ర హోంశాఖను కూడా ప్రతివాదిగా చేర్చాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ కొన్ని బిల్లులను రాష్ట్రపతి ముర్ముకు కూడా సిఫారసు చేశారని, అవి కూడా ఇంకా ఆమోదం పొందలేదని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం పేర్కొన్నది. ఏడు బిల్లుల్లో ఒక్కదానికి కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలతో సంబంధం లేదని తెలిపింది. ఈ బిల్లులను గవర్నర్‌ రెండేండ్లుగా పెండింగ్‌లో ఉంచారని,…

Read More

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎట్టకేలకు నీట్ యూజీ 2024 సవరించిన ఫలితాలను జూలై 26, శుక్రవారం ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in/NEET నుంచి తమ స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి, అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. గతంలో విడుదల చేసి, వివాదాస్పదం అయిన ఫలితాల్లో టాప్ ర్యాంక్ ను మొత్తం 61 మంది పంచుకోగా, ఈ రివైజ్డ్, ఫైనల్ ఫలితాల్లో కేవలం 17 మందికి టాప్ ర్యాంక్ వచ్చింది. 2024 జూన్ 4న ప్రకటించిన ఫలితాల్లో మొత్తం 67 మంది అభ్యర్థులు 720 మార్కులు సాధించడం అనుమానాలకు తావిచ్చింది. పరీక్ష కేంద్రంలో సమయం వృథా కావడంతో గ్రేస్ మార్కులు పొందిన ఆరుగురిని టాపర్స్ లిస్ట్ నుంచి ఎన్టీఏ తొలగించిన తరువాత, ఆ సంఖ్యను…

Read More

పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపుపై ప్రస్తావిస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అయితే రాష్ట్రాలు ఈ విషయంలో కలిసివస్తే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ఓ వార్తా సంస్ధతో మాట్లాడుతూ పలు అంశాలపై మాట్లాడారు.  కేంద్ర బడ్జెట్‌లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగలేదని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బిహార్‌లను మాత్రమే బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారని విపక్షాల విమర్శలను ఆమె తోసిపుచ్చారు.  2014లో రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో ఏపీకి విభజన చట్టం ప్రకారం సాయం చేయాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.  గతంలో మాదిరే రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని, ఏ ఒక్క రాష్ట్రానికీ నిధులను నిరాకరించలేదని సీతారామన్ తేల్చి చెప్పారు. ఏపీ పునర్వ్యవస్ధీకరణ చట్టం ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణంతో…

Read More

డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి క‌మ‌లా హ్యారిస్‌కు మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామామ‌ద్ద‌తు తెలిపారు. ఈ న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా క‌మ‌లా హ్యారిస్ పోటీ ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. రేసు నుంచి త‌ప్పుకున్న అధ్య‌క్షుడు బైడెన్‌ త‌న స్థానంలో క‌మ‌లా హ్యారిస్‌ను ప్ర‌తిపాదించారు.  అయితే క‌మ‌లా హ్యారిస్ విష‌యంలో డెమోక్ర‌టిక్ నేత‌లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా త‌న మ‌ద్ద‌తును తెలప‌లేదు. అయితే ఇవాళ ఒబామా దంప‌తులు .. క‌మ‌లాహ్యారిస్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.  మాజీ తొలి దంప‌తుల నుంచి హ్యారిస్‌కు ఫోన్ కాల్ వ‌చ్చింది. మిచెల్‌తో పాటు నేను కూడా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాన‌ని, ఈ ఎన్నిక‌ల్లో గెలుపు సాధించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని బ‌రాక్ ఒబామా తెలిపారు. క‌మ‌లా నీ ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని, నువ్వు చ‌రిత్ర సృష్టిస్తావ‌ని మిచెల్ ఆ ఫోన్…

Read More

అయిదేళ్ల వైసీపీ పాలన ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని, ఆర్థిక అవకతకలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై, వైసీపీ హయాంలో ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సరైన విధానం లేకుండా రాష్ట్ర విభజన జరగడంతో రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని పేర్కొన్నారు. రాజధానిగా హైదరాబాద్ ను కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఏపీలో పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండటంతో ఆదాయం చాలా తక్కువగా ఉంటుందని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రానికి 46 శాతం ఆదాయం మాత్రమే వచ్చిందని చెబుతూ 52 శాతం జనాభా ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వస్తే..42 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 54 శాతం ఆదాయం వస్తోందని చెప్పారు. కృష్ణపట్నం పోర్టు ఏపీలో ఉంటే దాని రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్ లో…

Read More

మహారాష్ట్రలో అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించడతో అధికారులు అప్రమత్తమయ్యారు. జులై 26, 27న మధ్య మహారాష్ట్ర, కొంకణ్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.  ముంబై, పుణేల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షపాతం నమోదవగా ఈ నగరాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు.  ముంబై, పుణే నగరాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ పేర్కొంది. అయితే ఈ రెండు రోజులు ముంబైలో స్కూళ్లు, విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించాలని అధికారులు యోచిస్తున్నారు.  ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు, బీఎంసీ అధికారులు కోరుతున్నారు.  వరద నీటికి ప్రజా రవాణ, ప్రయివేట్ ట్రాన్స్ పోర్ట్ ల రాకపోకలు విఘాతం ఏర్పడింది. లో విజిబిలిటీ కారణంగా విమానాలను కూడా ముంబైలో రద్దు చేశారు. భారీ వర్షం, నీటి ఎద్దడి కారణంగా కనీసం 10 విమానాలను దారి మళ్లించారు.…

Read More

అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పథకంపై యువతను తప్పు దోవ పట్టించే విధంగా ఆ యా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. జులై 26వ తేదీ కార్గిల్ దివాస్. ఈ సందర్భంగా అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు.  సైన్యంలో సంస్కరణల కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చినట్లు తెలిపారు. సైన్యంలోకి యువ రక్తాన్ని తీసుకు రావడంతోపాటు యుద్దానికి ఎల్లవేళలా సన్నద్ధంగా ఉండే విధంగా యువతను తయారు చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అగ్నిపథ్ సున్నితమైన అంశమని చెప్పారు. అలాంటి అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు.. తమ వ్యక్తిగత లాభం కోసం అగ్నిపథ్‌ పథకాన్ని రాజకీయ అంశంగా మలుచుకున్నాయని ప్రధాని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలు చేస్తున్న ఆ యా పార్టీల్లోని వ్యక్తులు.. గతంలో సైన్యంలో వేల కోట్ల రూపాయిల కుంభకోణాలకు పాల్పడి సైన్యాన్ని బలహీన పరిచాయని…

Read More

పోలవరం నిర్మాణం జాప్యానికి గత ప్రభుత్వమే కారణమని లోక్ సభలో కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ర్ ను మార్చడంతోనే ఈ జాప్యం జరిగిన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. లోకసభలో టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2021లో హైదరాబాద్ ఐఐటీ నివేదికలో ప్రాజెక్టు ఆలస్యానికి కారణాలు పేర్కొన్నట్టు కేంద్ర మంత్రిస్పష్టం చేశారు. కాంట్రాక్టరును మార్చడంతో పాటు… భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లో జాప్యం జరిగిందన్నారు. ప్రాజెక్టు తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని పార్లమెంటుకు జలశక్తి శాఖ చెప్పింది. గత మూడేళ్ళలో రూ. 8,044.31 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చినట్లు సీఆర్ పాటిల్ తెలిపారు. మూడేళ్ల పనుల పురోగతి వివరాలను కూడా సమాధానంలో పొందుపరిచారు. 2021..-22 నుంచి మూడేళ్ళలో ప్రాజెక్టు ప్రధాన పనుల్లో 21శాతం మట్టి…

Read More

రాష్ట్రపతి పదవిలో ఉన్నా ఉపాధ్యాయ వృత్తిపై ద్రౌపది ముర్ముకు మక్కువ తగ్గలేదు. ఆమె ఒకప్పుడు 1994-97 మధ్య కాలంలో రాయ్‌రంగ్‌పూర్ లోని శ్రీ అరబిందో ఇంటిగ్రెల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో గౌరవ అసిస్టెంట్ టీచర్‌గా వ్యవహరించారు. తాను రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టి గురువారం నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ప్రెసిడెంట్ ఎస్టేట్ లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సాక్షాత్తు రాష్ట్రపతియే వచ్చి తమకు పాఠాలు చెప్పడం విద్యార్థులకు చక్కని అనుభూతిని కలిగించింది. మొదట ఆమె విద్యార్థులను వారి పేర్లతో సహా వారి వ్యక్తిగత లక్షాలు, అభిరుచులు అడిగి తెలుసుకున్నారు. గ్లోబల్ వార్మింగ్‌పై బోధించి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. వీలైనన్ని మొక్కలు నాటితే పర్యావరణ మార్పు ప్రభావం మనపై ఉండబోదని సూచించారు. ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక…

Read More