ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యానికి బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలకు ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనాకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మోదీ పాల్గొన్న సభను భగ్నం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ఆకాశంలో వెళుతుంటే కింద రోడ్ల మీద పోలీసులు ట్రాఫిక్ ఆపుతారని, దేశ ప్రధాని పాల్గొన్న సభకు భద్రత కల్పించలేదని విమర్శించారు.డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు, గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ వైసీపీకి తొత్తుల్లా మారారని, కావాలని సభకు అటంకాలు సృష్టించారని ఆరోపించారు. సభలో పదేపదే మైకులకు అంతరాయం కలిగేలా జనాన్ని నియంత్రించకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రధాని పాల్గొన్న సభ విషయంలో ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని నిలదీశారు. పల్నాడు ఎస్పీ అనవసరంగా ఖాకీ చొక్కా వేసుకున్నారని,…
Author: Editor's Desk, Tattva News
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులకు రూ.100 కోట్ల మేర ముడుపులను బదలాయించడంలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఆ తరువాత కూడా మద్యం హోల్సేల్ అమ్మకం దారుల నుంచి సేకరించిన నిధుల పంపిణీ కొనసాగినట్లు వివరించారు. కవిత అరెస్ట్, తదుపరి పరిణామాలపై విడుదల చేసిన ఓ ప్రకటనలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు, తనిఖీలను నిర్వహించామని పేర్కొన్నారు. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి పలు ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ ఎంపీ సంజయ్ సింగ్, విజయ్ నాయర్ను అరెస్ట్ చేశామని అన్నారు. ప్రస్తుతం ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది. ఈ కేసులో…
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్కు రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తున్నది. 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం తేలింది. దీంతో ఆయన ఐదోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి. 1999 నుంచి దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్.. తాజా విజయంతో మరో ఆరేండ్లపాటు అదే పదవిలో ఉండనున్నారు. దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా జోసెఫ్ స్టాలిన్ను అధిగమించనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పుతిన్తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. అయితే ప్రధాన ప్రధ్యర్థి అయిన నావల్నీ ఎన్నికలకు ముందే చనిపోవడంతో ఆయనకు అసలు పోటీయే లేకుండా పోయింది. కాగా, …
ఎన్నికల బాండ్లకు సంబంధించిన యునిక్ సీరియల్ నంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెల 21వ తేదీలోగా తమ వద్ద ఉన్న అన్ని వివరాలను ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది. ఏ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారో తెలియజేసే నంబర్లతోపాటు అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి ఇచ్చి తీరాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు సమర్పించలేదని ఎస్బిఐను సుప్రీంకోర్టు నిలదీసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందజేసిన విరాళాలపై ఎస్బిఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ”వివరాలు సమర్పించమని చెప్పండి అప్పుడు చూస్తాం. అన్నట్లుంది మీ వైఖరి. ఎస్బిఐ సెలక్టివ్గా ఉండకూడదు. కోర్టుపట్ల నిజాయితీగా వ్యవహరించాలి” అని డి.వై. చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ”ప్రతి సమాచారం వెల్లడి కావాలి. బాండ్ల విషయంలో ఎస్బిఐ సెలెక్టివ్గా…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ శాసనసభాపక్షం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ హైదర్గూడలోని స్పీకర్ నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్ను అందజేశారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆ పార్టీ ఎమ్మె్ల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్పించుకొని ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. ‘నువ్వు కొట్టినావ్ మేము తీసుకున్నాం.. మేము కొట్టినప్పుడు రేవంత్ రెడ్డి.. నువ్వు లేవకుండా పొతావ్.’ అని ఘూటు వాఖ్యలు చేశారు. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే.. తిరిగి నాలుగు అడుగు ముందుకు దూసుకు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాగా, ఆదివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి…
దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని చెబుతూ భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే.. తనకు అంత శక్తి వస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని.. వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని మోదీ వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందిని.. మాల్కాజ్గిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్.. 400 పార్ అంటున్నారని.. ఈ సారి పక్కాగా 400 సీట్లు సాధిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడిందన్న మోదీ… తెలంగాణను…
గవర్నర్ పదవికి డా. తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తారని తెలుస్తున్నది. చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకూడి నుంచి బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. 2014 నుంచి 2019, సెప్టెంబర్ వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణకు గవర్నర్గా తమిళిసై నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని నిర్వహించిన తొలి మహిళగా నిలిచారు. ఆతర్వాత పుదుచ్చేరి ఇంచార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా, తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ అయిన తమిళిసై…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్తో మరోసారి పోటీకి సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ శనివారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఎన్నికలు అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నాయని అన్నారు. తాను మళ్లీ అధికారంలోకి రాకపోతే దేశంలో ‘రక్తపాతం’ మొదలవుతుందని బెదిరించారు. బైడెన్ విధానాలను విమర్శిస్తూ ఒహైయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న చైనా నిర్ణయాన్ని కూడా ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉత్పత్తయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించబోనని తెలిపారు. 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని చెప్పారు. పరోక్షంగా బైడెన్ వాహన పరిశ్రమ విధానాలను లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను గెలవకపోతే.. బహుశా అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవని కూడా చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఆయన ఎన్నికల ప్రచార బృందం…
వంద రోజులలో అమలు చేస్తామన్న గ్యారంటీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ `ప్రశ్నిస్తున్న తెలంగాణ’ పేరుతో వెబ్సైట్ పోస్టర్ను ఆవిష్కరించడం ద్వారా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సరికొత్త ప్రచారంకు శ్రీకారం చుట్టారు. ఇచ్చిన గ్యారంటీల అమలు జరిగే వరకు కాంగ్రెస్ను వెంటాడుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు అమలు చేసే పత్తా లేకుండా పోయిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుంచే ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెబుతూ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో తెలంగాణ తల్లి బంధీ అయిందని, ఉద్యమాలతో మొదలైన బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని మంట గలిపిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచిందని ధ్వజమెత్తారు. అందుకే భారతీయ జనతా పార్టీ నేటి నుంచే ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని చెప్పారు. మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారని, దివ్యాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇస్తామన్నారని ఆయన…
మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చాంపియన్గా నిలిచింది. టైటిల్ ఫైట్లో నిలిచిన తొలిసారే టైటిల్ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. తొలుత ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. శ్రేయాంక పాటిల్ (4-12), సోఫీ మిలోనెక్స్(3-20)..ఢిల్లీ పతనాన్ని శాసించారు. షెఫాలీవర్మ(44), మెగ్ ల్యానింగ్ (23) ఆకట్టుకోగా, రోడ్రిగ్స్(0), కాప్సె (0), కాప్ (8), జొనాసెన్ (3), రాధాయాదవ్ (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో 115-2 స్కోరు చేసింది. ఎలీస్ పెర్రీ(35 నాటౌట్), డివైన్(32) రాణించారు. శిఖాపాండే, మణి ఒక్కో వికెట్ తీశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా మిలోనెక్స్, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా దీప్తిశర్మ నిలిచారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ తమదైన రీతిలో దూకుడైన ఆటతీరు కొనసాగించింది. ఓపెనర్లు…