Author: Editor's Desk, Tattva News

వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ అవార్డు దక్కింది. వైద్యులు కాలిటన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు పురస్కారం వరించింది. కరోనా మహమ్మారికి కట్టడికి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం చేసిన కృషికి కాలిటన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్‌ అసెంబ్లీ పేర్కొంది.  ‘కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడానికి సహాయపడే న్యూక్లియోసైడ్‌ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు’ నోబెల్‌తో గౌరవిస్తున్నట్లు జ్యూరీ పేర్కొంది.  కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని 50 మంది ప్రొఫెసర్‌లతో కూడిన నోబెల్ అసెంబ్లీ ఏటా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తున్నది.  మానవజాతి ప్రయోజన కోసం వైద్యరంగంలో గణనీయమైన కృషి చేసిన శాస్త్రవేత్తలను జ్యూరీ గుర్తిస్తుంది. స్జోల్నోక్‌లో 1955లో జన్మించిన కటాలిన్ కరిక్ స్జెడ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెససర్‌గా, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో పెరెల్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అనుబంధ ప్రొఫెసర్‌గా ఉన్నారు. డ్రూ వెయిస్‌మన్‌ పెన్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా1901 నుంచి ఇప్పటివరకు ఫిజియాలజీ,…

Read More

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బిహార్​ కుల గణనకు సంబంధించి కుల గణన డేటాను తాజాగా నితీశ్​ కుమార్​ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ)లకు చెందిన వారు ఉన్నార‌ని సర్వేలో తేలింది. ఇందులో 36 శాతం అత్యంత వెనుకబడిన తరగతులు కాగా, 27.1 శాతం వెనుకబడిన తరగతులకు చెందిన వారు. ఇక 16 శాతం మంది జనరల్‌ కేటగిరీకి చెందిన వారు ఉండ‌గా, 19.7 శాతం షెడ్యూల్డ్ కులాలు ( ఎస్సీ), 1.7 శాతం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వారు ఉన్నారు. మిగిలిన సాధారణ జనాభా 15.5 శాతంగా గ‌ణాంకాలు న‌మోద‌య్యాయి. బిహార్​ జనాభా సుమారు 13.07 కోట్లు కాగా, వీరిలో ఈబీసీ (అత్యంత వెనకబడిన వర్గాలు) వాటా 36శాతం. ఓబీసీల వాటా 27.13శాతం. 19.7శాతం మంది ఎస్​సీలు 1.7శాతం మంది ఎస్​టీలు ఉన్నారు. ఇక బిహార్​ జనాభాలో యాదవులు అత్యధికం. బిహార్​ ఉప…

Read More

తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఎ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌ఐఎ అధికారులతోపాటు పోలీసుల బృందం కలిసి ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లోని పౌరహక్కుల నేతలు, కులనిర్మూలన సమితి, చైతన్య మహిళా సంఘాల నేతలు, అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.  వాళ్ల కుటుంబ సభ్యులనూ ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు, వాళ్ల కార్యకలాపాలకు సహకరిచండంపై విచారణ చేపట్టారు. మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రపడినవారితోపాటు, పౌరహక్కులు, ప్రజాసంఘాల్లో పనిచేస్తున్న పలువురి నివాసాలను జల్లెడపడుతున్నారు. హైదరాబాద్‌లో భవాని, న్యాయవాది సురేశ్‌ ఇళ్లలో ఎన్‌ఐఎ అధికార తనిఖీలు చేపట్టారు. వరంగల్‌లోని హంటర్‌ రోడ్డులో చైతన్య మహిళా మండలి సభ్యులు అనిత, శాంతమ్మ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఉస్మాన్‌ సాహెబ్‌పేటలో ఎల్లంకి వెంకటేశ్వర్లు, తిరుపతిలో క్రాంతి చైతన్య ఇండ్లలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీ చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఎన్‌ఐఎ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు, జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు రాజారావు…

Read More

ఒక అవకాశం ఇవ్వండి అని పాదయాత్రలో ముద్దులు పెట్టి మురిపింపజేస్తే నమ్మిన ప్రజలను దెయ్యంలా పట్టిపీడిస్తోన్న జగన్‌ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. నాలుగో విడత వారాహి విజయయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా అవనిగడ్డ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.  సిపిఎస్‌ రద్దు చేస్తానని ఉద్యోగులను, మద్యపాన నిషేధం అమలు చేస్తానని మహిళలను, మెగా డిఎస్‌సి ప్రకటిస్తానని ఉపాధ్యాయ అభ్యర్థులను, ప్రతి ఏటా జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తానని నిరుద్యోగ యువతను జగన్‌ మోసగించారని విమర్శించారు. ముఖ్యమంత్రి అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తానని, సమర్థవంతంగా సుపరిపాలన అందిస్తానని స్పష్టం చేశారు.  జగన్‌ పదేపదే మాట్లాడే ‘వై నాట్‌ 175 కాదు… ఈసారి వచ్చేది 15 స్థానాలు మాత్రమే. చూసుకోండి’ అని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-టీడీపీ కలిసి పని చేస్తాయని, మార్పు…

Read More

మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2న పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం ఓ గంట శ్రమదానం చేయాలని కోరారు. ఈ క్రమం లోనే ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంకిత్ బైయాన్ పురియాతో కలిసి ప్రధాని మోదీ శ్రమదానం చేశారు. స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. చెత్తను గంపల్లోకి ఎత్తారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. ‘ దేశమంతా స్వచ్ఛతపై దృష్టి సారిస్తోన్న తరుణంలో .. అంకిత్ బైయాన్‌పురియా, నేను కలిసి ఇదే కార్యక్రమం చేపట్టాం. కేవలం పరిశుభ్రతకే పరిమితం కాకుండా , ఫిట్‌నెస్, ఆ రోగ్యాన్ని కూడా ఇందులో మిళితం చేశాం. ఈ కార్యక్రమం .. పరిశుభ్ర ఆ రోగ్య భారతం సందేశాన్ని అందిస్తోంది.’ అని ప్రధాని మోదీ పేర్కొన్నా రు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, అనురాగ్…

Read More

2014 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో కదలిక వచ్చింది. ఈ నెల 4న సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను విచారణ చేయనుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును కూడా ముద్దాయిగా చేర్చాలని వైసిపి ఎంఎల్‌ఎ ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి (ఆర్కే) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు తెలంగాణ ఎసిబి నుంచి ఓటుకు నోటు కేసును సిబిఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు. 2017లో ఈ పిటిషన్లను ఆర్కే దాఖలు చేయగా ఈ నెల 4న లిస్టయింది. అయితే అంతకు ముందు రోజే చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు విచారణ జరగనుంది. అది జరిగిన తర్వాతి రోజే ఓటుకు నోటు కేసు విచారణకు వస్తుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ కేసును సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసును విచారించనుంది. గతంలో మొత్తం రేవంత్…

Read More

తెలంగాణాలో రైతుల పేరుతో దోపిడీ జరుగుతోందని, కాలువలు, ప్రోజెక్టుల పేరుతో విడుదల అవుతున్నా ఎక్కడా పనులు జరగడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహబూబ్ నగర్ లో ఆదివారం జరిగిన బీజేపీ బహిరంగసభలో మాట్లాడుతూ రైతులకు బిజెపి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. తెలంగాణ రైతులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. అదే విధంగా తెలంగాణాలో గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగులో రూ.900 కోట్లతో సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుతో ఎంతో మేలు జరగనుందని చెబుతూ దేశవ్యాప్తంగా జరిగే పసుపు ఎగుమతులతో తెలంగాణ ఎక్కవ స్థాయిలో ఉందని ప్రధాని గుర్తు చేశారు. అందుకని ఇక్కడ పసుపు బోర్డు…

Read More

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ ధృవీకరణ సాధించింది. ఆయా విభాగాల్లో అత్యుత్తమ విధానాలు, కార్యకలాపాలు, మౌళికవసతులకు ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు రోజుల పాటు రెండు దశల్లో గుర్తింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఆసంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివయ్య నేతృత్వంలోని అనుభవజ్ఞులైన బృందాలు 53 విభాగాలు, వివిధ పరిశోధనా కేంద్రాలు, కార్యాలయాలు, సెల్‌లలో విస్తృతంగా పర్యటించి ఆడిట్ నిర్వహించారు. నాలుగు రోజుల ఆడిట్ అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం వివిధ విభాగాల్లో ఐఎస్‌ఓ గుర్తింపు సాధించింది. విద్య, పరిపాలన,పర్యావరణ సుస్థిరత, నాణ్యతా ప్రమాణాలలలో శ్రేష్ఠతను కనబరిచి అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకుంది. ఎనర్జీ ఆడిట్ – ఐఎస్‌ఓ పచ్చదనం, పర్యావరణ ఆడిట్ , నాణ్యతా ప్రమాణాలు, అకడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆడిట్ , జెండర్ సెన్సిటైజేషన్ విభాగాల్లో లభించిన ఐఎస్‌ఓ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని ఓయూ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్, రిజిస్ట్రార్…

Read More

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2,000 డినామినేషన్ నోట్ల మార్పిడికి గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించాలని నిర్ణయించింది. మే 19న తిరిగి చలామణి నుంచి రూ. 2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత తాజాగా, ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు రూ. 2వేల నోట్ల మార్పిడికి గడువు సెప్టెంబర్ 30గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, “సమీక్ష ఆధారంగా, రూ. 2000 నోట్ల డిపాజిట్/మార్పిడి కోసం ప్రస్తుత ఏర్పాటును అక్టోబర్ 07 వరకు పొడిగించాలని నిర్ణయించాం” అని ఆర్‌బిఐ తెలిపింది. అప్పటి వరకు “రూ. 2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయి” అని ఆర్‌బిఐ తెలిపింది. మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లలో  రూ. 3.42 లక్షల కోట్లు విజయవంతంగా బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. ఇవి సెప్టెంబర్ 29, 2023…

Read More

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ముందుగానే ప్రకటించింది. భోపాల్ లోని షాజపూర్‌లో శనివారం నాడు జరిగిన కాంగ్రెస్ “జన్ ఆక్రోష్ యాత్ర” లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్‌నాథ్ పేరును అధికారికంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతో సభావేదికపై ఉన్నకమల్‌నాథ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అంతలోనే తెప్పరిల్లి సంతోషంతో సభికులకు, వేదికపై ఉన్న అందరికీ అభివాదం చేశారు. కమల్‌నాథ్ రాష్ట్రానికి చేసిన సేవలను రాహుల్ ప్రశంసించారు. రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని , తన హయంలో అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ ఆయన పూర్తి చేస్తారని రాహుల్ భరోసా ఇచ్చారు. కమల్‌నాథ్‌కు పోటీ ఎవరూ మధ్యప్రదేశ్‌లో లేరని, కాంగ్రెస్ గెలుపు ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. దేశం లోనే అవినీతికి కేంద్ర స్థానంగా మధ్యప్రదేశ్ నిలుస్తోందని శివరాజ్‌సింగ్ చౌహాన్ హయాం లోని…

Read More