శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 ప్రయోగం విజయవంతం అయింది. సోమవారం ఉదయం 10.42 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్12 వాహకనౌక ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఈ ప్రయోగానికి ఆదివారం ఉదయం 7.12 గంటల నుంచి కౌంట్డౌన్ ప్రారంభమైంది. నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన కౌంట్ డౌన్ అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్ఎల్వీ-ఎఫ్12 పొడవు 51.7 మీటర్లు కాగా, బరువు 420 టన్నులు. ఈ వాహకనౌక 2232 కిలోల బరువున్న నావిక్ ఉపగ్రహం ఎన్వీఎస్-01 నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. దీని ఉపగ్రహం జీవితకాలం 12 ఏళ్లని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందించనుంది ఈ ఉప్రగ్రహం. ఇండియన్ రీజనల్ నేవిగేషన్ సిస్టమ్ ని రూపొందించుకునే ప్రయత్నం ఈ ప్రయోగం కీలకం కానుంది. అందుకే …
Author: Editor's Desk, Tattva News
తమ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబంలోని ప్రతి బిడ్డ చదువుకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తామని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘తల్లికి వందనం’ పేరుతో ఈ పథకం అమలు చేస్తామని, కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికీ సాయం అందిస్తామని ఆయన వెల్లడించారు. ఏపీలోని రాజమండ్రిలో ఆదివారం ముగిసిన రెండు రోజుల టీడీపీ మహానాడులో చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ గ్యాస్ మేనిఫెస్టో విడుదల చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఆయన ప్రకటించారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. అంతేకాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ‘యువగళం’ పథకం కింద ఐదేళ్లలో 20…
2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఒక్క చోటకు చేర్చేందుకు కొంతకాలంగా జెడియు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్క కొలిక్కి వచ్చాయి. జూన్ 12న పాట్నాలో మొట్టమొదటి భేటీ జరిపేందుకు నిర్ణయించారు. 2024 ఎన్నికలలో అనుసరింపవలసిన ఉమ్మడి వ్యూహంపై జరిగే ఈ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ తో సహా సుమారు 18 పార్టీల నేతలు పాల్గొనగలరని భావిస్తున్నారు. ఇప్పటికే బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో కలిసి నితీష్ కుమార్ వ్యక్తిగతంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహల్ గాంధీ, మమతాబెనర్జీ, శరద్ పవర్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష పార్టీల ప్రముఖులను కలుసుకున్నారు. నితీష్ కుమార్ ప్రతిపాదించిన ”వన్-ఆన్-వన్” వ్యూహానికి మమతా బెనర్జీ సైతం సుముఖత వ్యక్తం చేశారు. ఈ ఫార్ములా ప్రకారం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీలు బీజేపీతో నేరుగా తలబడతాయి.…
మణిపూర్లో తిరుగుబాటుదారులపై బీరేన్ సింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆదివారం ఒక్కరోజే ఎనిమిది గంటల పాటు వేర్వేరు ప్రాంతాలలో ఎన్కౌంటర్లు జరిగినట్లు, దాదాపు 40 మంది వరకూ వేర్పాటువాదులను ఈ దశలో మట్టుపెట్టినట్లు తమకు సమాచారం అందిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. తిరుగుబాటుదారులను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ఉగ్రవాదులతో పోల్చారు. ‘‘సాధారణ పౌరులపై ఎం -16, ఎకె -47, స్నైపర్ గన్లతో ఉగ్రవాదులు దాడికి దిగుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఇండ్లకు నిప్పు పెడుతున్నారు. ఇండియన్ ఆర్మీ, ఇతర భద్రతాబలగాల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 40 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి’’ అని ఎన్. బీరేన్ సింగ్ మీడియాకు తెలిపారు. ఆందోళనకారులను కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని మణిపూర్ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మే 28న రాత్రి 2 గంటల సమయంలో ఇంఫాల్ లోయలోని సేక్మయి, సుంగు, ఫయేంగ్,…
దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాలంటూ కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ప్రారంభమైన నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా మహా పంచాయత్ నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. ఈ మేరకు నూతన పార్లమెంట్ భవనం వైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు జంతర్మంతర్ వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనలో పాల్గొన్న పలువురు రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అరెస్టయిన వారిలో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, మరో రెజ్లర్ బజరంగ్ పూనియా ఉన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని రెజ్లర్లు మండిపడ్డారు.…
ఐఫా-2023లో ఉత్తమ నటుడిగా నిలిచారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఈ అవార్డుల వేడుకకు యూఏఈ రాజధాని అబుదాబి వేదిక అయింది. బాలీవుడ్ తారల తళుకు బెలుకులు, నృత్య ప్రదర్శనల మధ్య అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇరవై మూడవ ఐఫా అవార్డుల్లో ఉత్తమ నటుడుగా హృతిక్ రోషన్ నిలిచాడు. విక్రమ్ వేద సినిమాకు గానూ హృతిక్ ఈ అవార్డును అందుకున్నాడు. ఉత్తమ నటిగా అలియాభట్ ఎంపికైంది. గంగూబాయి కతియావాడి సినిమాలో తన నటనకు ఈ అవార్డు వరించింది. కాగా ఈ అవార్డుల ఫంక్షన్కు అలియా రాకపోవడంతో ప్రముఖ నిర్మాత జయంతీలాల్ ఈ అవార్డును స్వీకరించాడు. ఉత్తమ చిత్రంగా దృశ్యం-2 నిలిచింది. భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించినందుకు గానూ కమల్ హాసన్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా పురస్కారాన్ని అందుకున్నాడు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధం అయ్యింది. నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్-1ను సోమవారం నింగిలోకి పంపనుంది. గతంలో నావిగేషన్ సర్వీసెస్ కోసం పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల్లో నాలుగింటి జీవిత కాలం ముగిసింది. ఆ సిరీస్లో భాగంగానే ఈ ఎన్వీఎస్ ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (NavIC) పేరుతో ఇస్రో అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇది. కక్ష్యలో ఉన్న ఏడు ఉపగ్రహాల సమూహం కాగా.. ఇది గ్రౌండ్ స్టేషన్లతో కలిసి పని చేయనుంది. ఇక.. నెట్వర్క్ సాధారణ వినియోగదారులు, వ్యూహాత్మక వినియోగదారులకు నావిగేషనల్ సేవలను కూడా ఈ శాటిలైట్ అందిస్తుంది. సాయుధ దళాలు, మెరుగైన పొజిషనింగ్, నావిగేషన్ అండ్ టైమింగ్ కోసం దేశంలో పౌర విమానయాన రంగానికి పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసింది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్…
కొత్త పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ 75 ఏళ్ల తరువాత కొత్త పార్లమెంట్ను నిర్మించుకున్నామని చెప్పారు. పవిత్రమైన సెంగోల్ను పార్లమెంట్లో ప్రతిష్టించుకున్నామన చెబుతూ భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్… కొత్త భారత్కు కొత్త జోష్ తీసుకొచ్చిందని ప్రధాని ప్రశంసించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని, 140 కోట్ల భారతీయుల కల సాకారమైందని, అధునిక భారత్కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతుందని ప్రధాని కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్కు పార్లమెంట్ సాక్షంగా నిలుస్తుందని ప్రశంసించారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదని పేర్కొంటూ అమృత్ కాల్లో అన్ని కఠిన సవాళ్లను అధిగమిస్తామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను కొత్త పార్లమెంట్ గౌరవిస్తుందని చెప్పారు. ‘‘ప్రపంచ ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి.. పునాది కూడా. ప్రజాస్వామ్యమే మన ఆలోచన, సంప్రదాయం’’ అని…
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ. 20 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఉదయం పాత పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద పూజలతో ప్రారంభోత్సం మొదలైంది. ఉదయం 7.30 నిమిషాలకు తొలుత గణపతి హోమం నిర్వహించారు. అనంతరం అధీనంల నుంచి స్వీకరించిన చరిత్రాత్మక రాజదండానికి సాష్టంగ ప్రమాణం చేశారు. స్పీకర్, అధీనంలతో కలిసి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించిన నరేంద్ర మోదీ.. లోక్సభలో సభాపతి ఛైర్ పక్కన ఆ రాజదండాన్ని ప్రతిష్టాపన చేశారు. భవన నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు, సిబ్బందిని మోదీ ఘనంగా సత్కరించారు. వారికి శాలువలు కప్పి, జ్ఞాపికలను అందజేశారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో ప్రధాని పాల్గొన్నారు. అంతకు ముందు శనివారం సాయంత్రం, అధికారిక రాజదండం సెంగోల్ను ప్రధాని నరేంద్ర మోదీకి తిరువవదుతురై మఠాధిపతులు,…
నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఐటీశాఖ అధికారులమని చెప్పి ఓ గోల్డ్ షాపులోకి వెళ్లి తనిఖీలు చేపట్టిన ముఠా 2 కిలోల బంగారంతో ఉడాయించింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ మోండా మార్కెట్ పోలీసులను ఆశ్రయించారు. శనివారం ఉదయం ఐదుగురు వ్యక్తులు మోండా మార్కెట్లోని బాలాజీ జ్యూవెలరీ దుకాణానికి వెళ్లారు. బంగారం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ దుకాణం వద్దకు వచ్చి సిబ్బందిని, యాజమాన్యాన్ని బెదిరించారు. దుకాణంలో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని సిబ్బందిని పక్కన కూర్చోబెట్టారు. షాపులో ఉన్న 17 బంగారం బిస్కట్లు (ఒక్కోటి 100 గ్రాములు)కు సంబంధించి ఎలాంటి ట్యాక్స్ చెల్లించలేదని చెప్పి బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడి నుంచి బంగారంతో వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని బాలాజీ జ్యూవెలరీ దుకాణ యజమాని ఆ ప్రాంతంలో ఉన్న మిగతా జ్యూవెలరీ షాపుల యజమానులక చెప్పాడు.…