దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటి మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఐదో సంవత్సరం ఐఐటి మద్రాస్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా, రెండు, మూడు స్థానాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) బెంగళూరు, ఐఐటి-ఢిల్లీ దక్కించుకున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ రూపొందించిన ఇండియన్ ర్యాంకింగ్స్ రిపోర్టు-2023ను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్ సోమవారం విడుదల చేశారు టాప్ 10 విద్యా సంస్థలు (ఓవరాల్): 1. ఐఐటి మద్రాస్, 2. ఐఐఎస్సి బెంగళూరు, 3. ఐఐటి ఢిల్లీ, 4. ఐఐటి ముంబయి, 5. ఐఐటి కాన్పూర్, 6. ఎయిమ్స్ ఢిల్లీ 7. ఐఐటి ఖరగ్పూర్, 8. ఐఐటి రూర్కే, 9. ఐఐటి గౌహతి, 10. జెఎన్యు ఢిల్లీ ఇలా ఉండగా, తెలంగాణాలో 14వ ర్యాంకులో ఐఐటి హైదరాబాద్, 20వ ర్యాంకులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, 53వ ర్యాంకులో ఎన్ఐటి…
Author: Editor's Desk, Tattva News
గత తొమ్మిదేండ్లలో ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రికార్డుస్థాయిలో 31.44% వృద్ధిని సాధించిందని మంత్రి కేటీ రామారావు తెలిపారు. అదే సమయంలో భారత్ వృద్ధి కేవలం 9.36% మాత్రమేనని వెల్లడించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ జాతీయ సగటు కంటే మూడున్నర రెట్లు ఎక్కువ వృద్ధి సాధించిందని తెలిపారు. 2013-14లో హైదరాబాద్లో ఐటీ ఉత్పత్తులు రూ.56 వేల కోట్లు ఉంటే, అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ రూ. 2.41 లక్షల కోట్లకు చేరుకొన్నామని వివరించారు. 2022-23లో ఐటీ ఉద్యోగాల్లో 16.29 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు. 2021-22లో ఐటీ రంగంలో 7 లక్షల 78 వేల 121 ఉద్యోగాలుంటే 2022-23 వరకు 9 లక్షల 5 వేల 715కు పెరిగాయని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే లక్షా 27 వేల 594 కొత్త ఉద్యోగాలు వచ్చినట్టు చెప్పారు. సోమవారం టీ హబ్ వేదికగా 2022-23 ఐటీ శాఖ వార్షిక నివేదికను కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, …
ఒడిషాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ జిల్లాలోని రైలు మార్గం మీదుగా పునరుద్ధరించిన పట్టాలపై సోమవారం వందేభారత్ రైలు వెళ్లింది. ఈ తొలి హైస్పీడ్ ప్యాసింజర్ రైలు హౌరా పురి వందేభారత్ మూడు ప్రమాదాలు జరిగిన చోట ట్రాక్లపై వెళ్లుతున్న దశలో అక్కడ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇతరులు ఉన్నారు. డ్రైవర్ల వైపు మంత్రి అభివాదం చేశారు. అంతకు ముందు ఈ రూట్లో గూడ్స్ రైలు వెళ్లిన దశలో రైల్వే మంత్రి చేతులు జోడించి కొద్ది సేపు ప్రార్థన చేశారు. ఈ ప్రాంతంలో పూర్తిగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనుల పర్యవేక్షణకు రైల్వే మంత్రి ఇక్కడ ఉన్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బహానగా బజార్ స్టేషన్ను వందేభారత్ రైలు దాటింది. ఆదివారం రాత్రి ఈ ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు రైల్వే మంత్రి వివరించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను చేపట్టారు.…
టీఎస్పీఎస్సీ గ్రూప్ –1 ఈ నెల 11న యథాతథంగా సాగనుంది. ప్రిలిమినరీ పరీక్ష రద్దును కోరుతూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కమిషన్ సిబ్బందిని రీ షఫ్లింగ్ చేశామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.8 లక్షల మంది గ్రూప్ 1 కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. 1.59 లక్షల మంది ఇప్పటికే హాల్ టికెట్లను కూడా డౌన్ లోడ్ చేసుకున్నారని ఏజీ.. కో ర్టుకు విన్నవించారు. 995 సెంటర్లలో పరీక్షలు నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పరీక్షకు వారం రోజుల ముందు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడం సరికాదన్నారు. ఈ వాదనలు నమోదు చేసుకున్న న్యాయస్థానం పేపర్ లీక్ లో అరెస్టయిన వారు ఇంకా సర్వీస్ కమిషన్ లో కొనసాగుతున్నారా? అని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఏజీ పేపర్ లీకేజీ వ్యవహారం బయటికి రాగానే ప్రభుత్వం…
ఒడిశాలో గత శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాద ఘటన తర్వాత రైల్వే ట్రాక్ పునర్ధురణ అనంతరం సోమవారం ఉదయం హైరా నుంచి పూరీ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు బాలాసోర్ మీదుగా ప్రయాణించింది. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ బహనాగ బజార్ స్టేషన్ మీదుగా వెళ్లినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రెండు ట్రాకుల మీదుగా రైళ్ల రాకపోకలకు వీలుగా పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు వారు చెప్పారు. వందే భారత్ రైలు వెళుతున్న సమయంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బహనాగ రైల్వే స్టేషన్లో నిలబడి డ్రైవర్లకు చేతులు ఊపి అభివాదం చేశారు. దీంతోపాటు హౌరా నుంచి పూరీ వెళ్లే ఎక్స్ప్రెస్తోపాటు భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కూడా సోమవారం తెల్లవారుజామున ఇదే మార్గంలో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రికే రెండు లైన్లలో ట్రాకుల పునరుద్ధరణ…
గంగానదిపై నిర్మాణంలో ఓ వంతెన పేక మేడలా కూలిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. బిహార్లోని భాగల్పుర్ జిల్లాలో గంగానదిపై నిర్మిస్తున్న అగువానీ – సుల్తాన్గంజ్ వంతెన ఆదివారం కుప్పకూలింది. అయితే, డిజైనులో లోపాలు ఉన్నందున నిపుణుల సూచన మేరకు కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. భాగల్పుర్, ఖగారియా జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ వంతెన పిల్లర్లు గత ఏప్రిల్లో తుఫాను కారణంగా కొంతభాగం దెబ్బతిన్నాయి. ఈ నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి బిహార్లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. 2015లో ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ శంకుస్థాపన చేయగా.. ఈ నిర్మాణం 2020 నాటికి పూర్తికావాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ పనులు అసంపూర్తిగానే జరిగాయి. వంతెన కూలుతున్న సమయంలో స్థానికులు ఆ దృశ్యాలను వీడియోల్లో రికార్డు చేశారు. అప్పుడెప్పుడో 2014లో ప్రారంభమైన దీని నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడం గమనార్హం. ఆ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలయడం…
ఒడిశా రైలు ప్రమాదం ఘటనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు. రైల్వే బోర్డు మొత్తం కేసును పూర్తి స్థాయి దర్యాప్తు కోసం సీబీఐకి సిఫారసు చేస్తోందని చెప్పారు. అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఎలాంటి పరిపాలనాపరమైన సమాచారం వచ్చినా దర్యాప్తును సీబీఐతో జరపాలని బోర్డు నిర్ణయించిందని వివరించారు. అయితే, ప్రమాదానికి మూల కారణాన్ని, దానికి బాధ్యుతులైన ‘నేరస్తులను’ గుర్తించామన్న ఆయన కొద్ది గంటల్లోపే సీబీఐకి సిఫారసు చేస్తున్నట్లు తెలుపుడం గమనార్హం. సంఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాలు పూరయ్యాయని మంత్రి తెలిపారు. సంఘటనా స్థలంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే ట్రాక్కు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, ఓవర్హెడ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక దుర్ఘటన అనంతరం బాలాసోర్లోని రెండు రైల్వే లైన్లు ఆదివారం రాత్రి 8 గంటలకు పునరుద్ధరించనున్నట్టు రైల్వే బోర్డు…
తెలంగాణలో ఆదివారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటివరకు ఎండ మండిపోగా ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి వాతావరణమంతా చల్లబడిపోయింది. కాసేపటికే జల్లులు కురిశాయి. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన కుండపోత వాన కురిసింది. రాగల నాలుగు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో వారం రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎండ, వేడిగాలులతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచన చల్లని కబురు అందించింది. నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. గాలి వేగం గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని తెలిపింది. పలు జిల్లాలు…
చైనా అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో ఆరునెలల పాటు పాలుపంచుకున్న ముగ్గురు వ్యోమగాములు ఆదివారం తిరిగి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. షెంఝో 15 వ్యోమనౌకలో వ్యోమగాములు ఫెయి జున్లాంగ్, డెంగ్ క్వింగ్మింగ్, ఝాంగ్ లూ ఉత్తర ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ లోని డాంగ్ఫెంగ్ ల్యాండింగ్ సైట్లో బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.33 గంటలకు సురక్షితంగా చేరుకున్నారు. ఈ ముగ్గురు వ్యోమగాములు నవంబర్ 29న షెన్జౌ 15 వ్యోమనౌకలో అంతరిక్షపరిశోధన కేంద్రానికి వెళ్లారు. వీరి అంతరిక్ష మిషన్ విజయవంతమైందని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సిఎంఎస్ఎ) ప్రకటించింది. ఈ ముగ్గురు ఆరోగ్యం గానే ఉన్నారని ఏజెన్సీ ప్రకటించింది. సురక్షితంగా చేరుకున్నాక వీరిని ఒక విమానంలో బీజింగ్ తీసుకువచ్చి క్వారంటైన్లో వైద్య పరీక్షలు చేశారు. వీరి స్థానంలో బయలు దేరి మే 30న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ముగ్గురు వ్యోమగాములకు వీరు వీడ్కోలు పలికి బయలుదేరారు. అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం ఉన్న…
కర్ణాటకలో అనూహ్య విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోష్ లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ వైపు దృష్టి సారిస్తున్నది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటక తర్వాత తమ తదుపరి టార్గెట్ తెలంగాణ అని ప్రకటించారు. వాస్తవానికి ఈ సంవత్సరం చివరిలోగా కర్ణాటక పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాస్త్రాలలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ అన్ని రాస్త్రాలలో కాంగ్రెస్ ప్రధాన రాజకీయ పక్షాలలో ఒకటిగా ఉంది. పైగా, మిగిలిన నాలుగు రాస్త్రాలలో నేరుగా బిజెపితో తలబడుతుంది. అయితే, పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్న తెలంగాణపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తుంది. దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణాలో పాగా వేసేందుకు కొంతకాలంగా బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. పైగా, పలు ఎన్నికలలో కాంగ్రెస్ ను వెనుకకు నెట్టేసింది కూడా. అయితే కర్ణాటకలో సాధించిన విజయంతో వచ్చిన ఉత్సాహంతో తెలంగాణపై దృష్టి…