Author: Editor's Desk, Tattva News

చెన్నై నగర వరదల నిర్వాహణ పనుల ప్రాజెక్టుకు సంబంధించి రూ 561.29 కోట్ల ప్రణాళికకు ప్రధాని నరేంద్ర మోదీ అనుమతిని ఇచ్చారు. చెన్నై బేసిన్ ప్రాజెక్టు పరిధిలో సంబంధిత పనులు జరుగుతాయని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ప్రస్తుత మిచౌంగ్ తుపాన్‌తో చెన్నై భారీ స్థాయిలో వరదలతో అతలాకుతలం అయిపోతున్న దశలో ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన వెలువరించింది. ఇంతకు ముందు కూడా భారీ వర్షాలు వరదలతో చెన్నైలో వరదలు తలెత్తాయి. ఎక్కువగా తుపాన్ల తాకిడి ప్రాంతంగా ఉంటూ వస్తున్న ఈ నగరానికి సరైన శాశ్వత పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని భావిస్తున్నారు. దేశంలో పలు మెట్రోపాలిటన్ నగరాలలో ఇటీవలి కాలంలో భారీ వర్షాలు వరదల పరిస్థితి ఏర్పడుతోంది. గడిచిన ఎనిమిదేళ్లలో చెన్నై ఇప్పటికీ మూడు సార్లు భారీ స్థాయి ఉధృత వరదల స్థితిని ఎదుర్కొందని కేంద్ర హోం మంత్రి తమ ప్రకటనలో తెలిపారు. ఆకస్మిక వరదలతో…

Read More

తెలంగాణ శాసనసభ కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నియమితులయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయనను ఎంపిక చేసింది. ఇటీవలి ఎన్నికల్లో వికారాబాద్‌ నుంచి గెలుపొందిన గడ్డం ప్రసాద్‌ కుమార్‌ గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులతో కేబినేట్‌ లో పని చేసిన అనుభవం, అణగారిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి.. ఇవి తెలంగాణ కొత్త స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ విశేషాలు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈయన రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించారు. ఇంటర్‌ చదివారు. 2008 ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కేబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుస ఓటములను చవిచూశారు. 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఇక తాజాగా 2023…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ తమిళిసై వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లారు. ఆ తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించారు. తెలంగాణ మంత్రులు.. వారి శాఖలు ఇవే: .మల్లు భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ.ఉత్తమ్ కుమార్ రెడ్డి – హోం.శ్రీధర్ బాబు – ఆర్థిక శాఖ.తుమ్మల నాగేశ్వరరావు – రోడ్లు, భవనాల శాఖ.జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరాల శాఖ.దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ.పొన్నం ప్రభాకర్ – బీసీ సంక్షేమ శాఖ.సీతక్క – గిరిజన సంక్షేమ శాఖ.కొండా సురేఖ – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ.కోమటిరెడ్డి వెంకటరెడ్డి – పురపాలక శాఖపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – నీటిపారుదల శాఖ. సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి, ఇంటెలిజెన్స్…

Read More

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌ రెడ్డి  గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్‌తో గవర్నర్‌ డా. తమిళిసై సౌందరాజన్ ఆయనచేత ప్రమాణం చేయించారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి గుడికి కుటుంబ సమేతంగా వెళ్లిన రేవంత్‌ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. మర్గమధ్యలో గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రిగా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. మంత్రులుగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు చేత మంత్రులుగా గవర్నర్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రా, హిమాచల్‌ప్రదేశ్‌…

Read More

కాలుష్య కారకాలను తగ్గించే లక్ష్యంతో వాతావరణ చర్చలు దుబాయిలో ప్రారంభమై వారం గడిచింది. కాప్‌28 సదస్సు ప్రారంభంలోనే నష్టపరిహారం నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా సత్వర కార్యాచరణను, ఒప్పందాన్ని ఆమోదించిన నేతల చర్చలు ప్రస్తుతం ఆశలు, అవరోధాల మధ్య ఊగిసలాడుతున్నాయి.  ”చర్చలు ఇప్పుడు మిశ్రమ స్పందనగా వున్నాయి. కొన్ని రంగాలకు సంబంధించి దేశాల మధ్య పెద్ద తేడాలే కనిపిస్తున్నాయి.” అని జర్మనీ వాతావరణ దూత జెన్నిఫర్‌ మోర్గాన్‌ వ్యాఖ్యానించారు. ‘అయితే పురోగతి సాధించేందుకు సంకల్పం మాత్రం వుంది.” అని స్పష్టం చేశారు.  చమురు, గ్యాస్‌, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను దశలవారీగా రూపుమాపాలని కోరుతున్న ప్రతిపాదకులు ఇన్నేళ్ళలో మొదటిసారిగా చర్చల పట్ల ఆశాభావంతో వున్నారని అధికారులు పేర్కొంటున్నారు. కానీ, అది ఎక్కడ దాడి చేస్తుందో కూడా చూడాల్సి వుంటుందన్నారు.  పేద దేశాలకు ఆర్థిక సాయం అందించాలనే కీలకమైన అంశాలపై ఎలా ముందుకు సాగాలనే విషయమై ఇంకా కసరత్తు జరగాల్సి వుందని…

Read More

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన బండారు జగదీష్‌ను (కేశవ) పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉండగా జగదీశ్ ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని జగదీశ్ బెదిరించినట్లుగా ఆరోపణ. బెదిరింపులకు పాల్పడిన జగదీశ్ ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. జగదీశ్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఆ మహిళ (జూనియర్ అర్టిస్టు) గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని…

Read More

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులు బుధవారం తమ లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేశారు.  ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఈ నేతలు పార్లమెంట్‌లోని స్పీకర్ కార్యాలయంలో తమ రాజీనామాలను సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 12 మంది బీజేపీ ఎంపీల్లో 10 మంది బుధవారం ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారని, ఆయనతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం లోక్‌సభకు రాజీనామాలు సమర్పించారని బీజేపీ వర్గాలు తెలిపాయి. జేపీ నడ్డా వారిని స్పీకర్ కార్యాలయానికి తీసుకెళ్లినట్లు వెల్లడించాయి. కాగా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి రాజీనామా సమర్పించిన వారిలో కేంద్ర మంత్రులు నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, ఎంపీలు రితీ పాఠక్, రాకేష్ సింగ్, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో…

Read More

తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బిజెపికి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను బిజెపి గెల్చుకుందని చెప్పారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, కెసిఆర్ చేసి వెళ్లిన అప్పులు తీర్చే క్రమంలో చతికిలపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఏడాది లోపే ఆ పార్టీ కూడా చేతులెత్తేస్తుందని, ఆపై తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వమే వస్తుందని రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మరిన్ని అప్పులు చేయాలని చెబుతూ కేసీఆర్ దిగిపోతూ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారని ఆరోపించారు. ఆ అప్పులు తీర్చలేక కాంగ్రెస్ నేతల్లో గందరగోళం మొదలవుతుందని చెప్పారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ ఈ సంచలన వాఖ్యలు చేశారు. కేసీఆర్‌ పథకాలను అమలు చేస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారని, దళితులను…

Read More

భారత తొలి ప్రధాని నెహ్రూ చేసిన రెండు పొరపాట్ల వల్లనేనే  జమ్మూ కాశ్మీర్ నష్టపోయిందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ బిల్లులపై చర్చ సందర్భంగా లోక్ సభలో విమర్శించారు.  మొదట కాల్పుల విరమణ ప్రకటించి, ఆపై కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లడం ద్వారా నెహ్రూ తప్పులు చేశారని పేర్కొన్నారు.  జవహర్‌లాల్ నెహ్రూ సరైన చర్యలు తీసుకుంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు భారతదేశంలో భాగమై ఉండేదని, ఇది చారిత్రాత్మక తప్పిదమని అమిత్ షా విమర్శించారు. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. అనంతరం రెండు బిల్లులు ఆమోదం పొందగానే విపక్షాలు వాకౌట్ చేశాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మూడో రోజు లోక్ సభ జమ్ము కశ్మీర్ కు సంబంధించిన రెండు కీలక బిల్లుల్ని ఆమోదించింది.లోక్‌సభ ఆమోదించిన బిల్లుల్లో జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023, అలాగే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2023 ఉన్నాయి.  1947 లో పాకిస్తాన్…

Read More

తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని మిచౌంగ్ తుఫాను అతలాకుతలం చేసింది. ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం జరిగింది. మిచౌంగ్ తుఫాను కారణంగా సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు చెన్నై నగరం, చుట్టుపక్కల జిల్లాలను వణికించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు.  అయితే మంగళవారం నుంచి చెన్నైలోని చాలా ప్రాంతాలు వర్షాల నుంచి ఉపశమనాన్ని పొందాయి. దీంతో సహాయక సిబ్బంది ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి వీలు కలిగింది.  చెన్నైలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో ఫోర్‌షోర్ ఎస్టేట్‌లో 60 ఏళ్ల మహిళ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన 48 ఏళ్ల వ్యక్తి ఉన్నారు.  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షం సంబంధిత ఘటనల్లో గాయపడిన మరో పదకొండు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం వరకు వర్షాలు…

Read More