Author: Editor's Desk, Tattva News

నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వ చింతనే పరిష్కారమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి సందర్భంగా సోమవారం నాగార్జున విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్‌ సచ్చిదానంద మూర్తి సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ ఆఫ్రో-ఏషియన్‌ ఫిలాసఫీ నిర్వహించిన ప్రత్యేక సదస్సుకు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  కొత్త సచ్చిదానందమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు. ఇప్పటివరకు ముద్రితం కాని ఆచార్య సచ్చిదానందమూర్తి రచనలను” ఆన్‌ ఎడ్యుకేషన్‌ ది ఫిలాసఫీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌” పేరుతో ప్రొఫెసర్‌ అశోక్‌ వోహ్రా, కె. రమేష్‌ సంపాదకత్వం లో తీసుకువచ్చిన పుస్తకాన్ని, ఆయన స్మఅతి చిహ్నంగా తీసుకువచ్చిన పోస్టల్‌ కవర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ … ” ఆధునిక విద్యాభ్యాసంలో తత్వశాస్త్రం ఒక ప్రత్యేక విభాగంగా రూపుదిద్దుకోవడం మనిషి వికాసానికి,సమాజ వికాసానికి ఎంతో…

Read More

పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ అధినేత కేజ్రీవాల్ కు సోమవారం సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి కింద కోర్టులో విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించారంటూ వీరు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఇది 2018 నాటి కేసు. అప్పుడు ఆప్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ , బీజేపీ ఆదేశాలతో వివిధ వర్గాలకు చెందిన 30 లక్షల మంది ఓటర్ల పేర్లను ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. దీనిపై బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని ఫిర్యాదు చేశారు. దీనిపై ఆతిశీ, కేజ్రీవాల్‌కు 2019లో ట్రయల్ కోర్టు నోటీసులు ఇచ్చింది. వాటికి వ్యతిరేకంగా ఆప్ నేతలు సెషన్స్ కోర్టును , హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే…

Read More

హిందువులు పవిత్రంగా పూజించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ – షిండే శివసేన – అజిత్ పవార్ ఎన్సీపీ కూటమిలోని మహాయుతి ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ ఆవులను రాజ్యమాత-గోమాతగా ప్రకటించింది.  ఈ మేరకు ఏక్‌నాథ్ షిండే సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. మన భారతదేశ సంప్రదాయంలో పూర్వపు కాలం నుంచి ఆవులకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ ఆమోదించిన ప్రభుత్వ తీర్మానం ప్రకారం.. రాజ్యమాత హోదాను కేవలం దేశీయ ఆవులకు మాత్రమే వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. వేద కాలం నుంచి భారతదేశ ఆవుల ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకున్న ఏక్‌నాథ్ షిండే సర్కార్.. మానవ పోషణలో దేశవాళీ ఆవుల పాత్ర కీలకంగా ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఆవు పాల ప్రాముఖ్యత, ఆయుర్వేద,…

Read More

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ జరగకముందే కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఇరువాదనలు విన్న కోర్టు కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది. దాదాపు గంటపాటు సాగిన వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను అక్టోబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణల మేరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నాయకుడు , న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామితో సహ పలువురు న్యాయవాదులు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. లడ్డూలో నాణ్యత లోపం ఉందని భక్తులు ఫిర్యాదు చేయడంతో టీటీడీ అధికారులు తనిఖీలు నిర్వహించి నెయ్యిని సరఫరా చేస్తున్న ఏఆర్‌ ఫుడ్స్‌ ట్యాంకర్లను పరిశీలించి…

Read More

భారతదేశంలో సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ‘దాదా సాహెబ్ ఫాల్కే’. ఈ అవార్డును పొందడం అంటే నటీనటులకు వారి జన్మ సార్థకమైనట్లే. తాజాగా ఈ అవార్డ్ బాలీవుడ్ విలక్షణ నటుడు, లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి ని వరించింది. ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లుగా అధికారికంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.  అక్టోబర్ 8న జరగనున్న నేషనల్ అవార్డ్స్ ప్రజంటేషన్ ఈవెంట్‌లో ఈ పురస్కారాన్ని మిథున్ చక్రవర్తి అందుకోనున్నారు. మిథున్ చక్రవర్తి ఈ అవార్డుకు ఎంపికైనట్లుగా తాజాగా కేంద్ర, సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా ప్రకటించారు. లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి విషయానికి వస్తే.. 1950లో ఆయన కోల్‌కతాలో జన్మించారు. 1976లో ఆయన నటుడిగా ‘మృగాయ’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. విశేషం ఏమిటంటే తొలి చిత్రంతోనే ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత…

Read More

తమిళనాడులో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది.ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ లభించింది. తమిళనాడు మూడో ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి నియమితులయ్యారు. మనో తంగరాజ్‌తోపాటు మరో ముగ్గుర్ని కేబినెట్ నుంచి తప్పించిన స్టాలిన్.. మనీలాండరింగ్ కేసులో జైలుకెళ్లి.. మూడు రోజుల క్రితమే బెయిల్ మీద బయటకొచ్చిన సెంథిల్ బాలాజీని కేబినెట్లోకి తీసుకున్నారు. ఆర్.రాజేంద్రన్, డాక్టర్ గోవి చెళియన్, ఎస్ఎం నాజర్‌లు సైతం ఆదివారం సాయంత్రం తమిళనాడు మంత్రులుగా ప్రమాణం చేశారు. డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్.. సినీ నటుడిగా ప్రజలకు పరిచయం అయ్యారు. 2008 ప్రొడ్యూసర్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఉదయనిధి.. 2012లో ఒరు కాల్ ఒరు కన్నడి సినిమా ద్వారా హీరోగా మారారు. ఓకే ఓకే పేరిట తెలుగులోకి డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్- తిరువల్లికెని నియోజకవర్గం…

Read More

తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి పై అందిన ఫిర్యాదులో విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని సిట్‌ చీఫ్‌ సర్వ శ్రేష్ట త్రిపాఠి వెల్లడించారు. లడ్డు వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు కోసం చీఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సిట్‌ బృందం శనివారం శ్రీవారిని దర్శించుకుని, తిరుపతి పద్మావతి అతిథి భవనంలో సిట్‌ చీఫ్‌ త్రిపాఠి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉదయం పద్మావతి అతిధి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావుతో ప్రత్యేకంగా 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. కల్తీ నెయ్యి పై ఆరా తీశారు. అనంతరం పక్కనే ఉన్న పోలీస్‌ అతిథి గఅహంలో సిట్‌ బృందం అంతర్గత సమావేశం అయింది. అనంతరం మీడియాతో సిట్‌ చీఫ్‌ త్రిపాఠి మాట్లాడారు. లడ్డులో నెయ్యి కల్తీ ఉందని తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు అందడంతో ఆ కేసును తీసుకుని విచారణ ప్రారంభించామని…

Read More

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో ఆదివారం ఆ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయన అదుపు తప్పి పడపోబోయారు. దీంతో అక్కడున్న నేతలు ఖర్గేను పట్టుకున్నారు. వెంటనే నీరు తాగించారు. అయినప్పటికీ ఆయన ప్రసంగాన్ని మాత్రం ఆపలేదు. పార్టీ నేతలు ఆయనను పట్టుకుని నిలబడి ఉండగా ప్రసంగాన్ని కొనసాగించారు. “జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకువస్తాం. అందుకోసం పోరాడుతూనే ఉంటాం. ఎనిమిది పదుల వయసులో ఉన్న నేను అప్పుడే చనిపోను. మోదీ సర్కార్‌ను గద్దె దించే వరకు అలసిపోను. అప్పటివరకు బతికే ఉంటా” అని స్పష్టం చేశారు. అయితే మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురైన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వెంటనే పార్టీ అగ్రనాయకత్వం జమ్ముకశ్మీర్‌ నేతలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. అనంతరం కఠువా ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం పార్టీ నాయకులు ఖర్గేని తీసుకెళ్లారు. ఆరోగ్య…

Read More

ప్రజలు సకారాత్మక పరిణామాలు, స్ఫూర్తిదాయక, ప్రోత్సాహక కథనాలను ఇష్టపడుతున్నట్లు తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ సూచించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం స్పష్టం చేశారు. రేడియో కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రసారం పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నదని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల కృషి, సామాజిక అంశాల గురించి మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రస్తావిస్తుంటారు. దీనిని ‘భావోద్వేగపూరిత’ ఎపిసోడ్‌గా మోదీ అభివర్ణిస్తూ, ఈ కార్యక్రమం భారత స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే, దేశ సంఘటిత బలాన్ని ప్రదర్శించే విశిష్ట వేదికగా మారిందని పేర్కొన్నారు, దీని సందేశాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నందుకు ఆయన మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానాంశం ఉత్కంఠ కలిగించేదిగా లేకుంటే లేదా ప్రతికూలంగా ఉంటే ప్రజలు దృష్టి పెట్టరన్న అపోహ ఉందని, అయితే, ‘మన్ కీ బాత్’ వారు సకారాత్మక సమాచారం కోసం ఆత్రుతతో ఉంటారని సూచించిందని ప్రధాని…

Read More

సిపిఐ (ఎం) సీనియర్ నేత ప్రకాశ్ కరత్ మధ్యంతర ఏర్పాటుగా పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమన్వయకర్తగా ఉంటారని లెఫ్ట్ పార్టీ ఆదివారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించనున్న 24వ పార్టీ కాంగ్రెస్ వరకు ఈ ఏర్పాటు ఉంటుందని పార్టీ తెలియజేసింది. సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి 72వ ఏట ఈ నెల 12న మరణించిన నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నది. 2025 ఏప్రిల్‌లో మదురైలో నిర్వహించనున్న 24వ పార్టీ కాంగ్రెస్ వరకు మధ్యంతర ఏర్పాటుగా కామ్రేడ్ ప్రకాశ్ కరత్ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమన్వయకర్తగా ఉండాలని ప్రస్తుతం న్యూఢిల్లీలో సెషన్‌లో ఉన్న సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ నిర్ణయించింది’ అని పార్టీ తెలియజేసింది. ‘సిపిఐ (ఎం) సిట్టింగ్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారామ్ ఏచూరి ఆకస్మిక మరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడమైంది’ అని పార్టీ తెలిపింది. సిపిఐ (ఎం) సీనియర్ నేతల్లో ఒకరైన…

Read More