లాంగ్ మార్చ్ 2డీ రాకెట్ను చైనా ప్రయోగించింది. ఆ రాకెట్ ద్వారా 41 ఉపగ్రహాలను పంపింది. ఒకే మిషన్లో అన్ని శాటిలైట్లను పంపడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో చైనా సరికొత్త రికార్డును సృష్టించిందని జిన్హువా మీడియా తెలిపింది. షాంగ్జి ప్రావిన్సులో ఉన్న తైయువన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి ఈ రాకెట్ను ప్రయోగించారు.
లాంగ్ మార్చ్ రాకెట్ సిరీస్లో ఇది 476వ ఫ్లయిట్ మిషన్ కావడం విశేషం. ఇటీవల చంద్రునిపై వ్యోమగాములను ఉంచాలనే లక్ష్యంతో చైనా తన కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు వ్యక్తులను పంపిన సంగతి తెలిసిందే. చైనా ప్రయోగించిన శాటిలైట్లు.. కమర్షియల్ రిమోట్ సెన్సింగ్ సర్వీసులను కల్పించనున్నాయి.
ఆ శాటిలైట్లలో 36 జిలిన్-1 సిరీస్కు చెందినవి. గురువారం నాటి ప్రయోగంతో ఇప్పటి వరకు చైనా మొత్తం 108 జిలిన్-1 శాలిలైట్లను ప్రయోగించినట్లు జిన్హువా తెలిపింది. దీంతో 100 కంటే అధిక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలతో కూడిన మొదటి వాణిజ్య కూటమిగా చైనా అవతరించిందని వెల్లడించింది.
జిలిన్-1 శాటిలైట్ను 2015లో చైనా ప్రయోగించింది. ఆ శాటిలైట్ బరువు సుమారు 420 కేజీలు ఉంటుంది. ప్రస్తుతం ఈ శాటిలైట్ల బరువు కేవలం 22 కిలోలు మాత్రమేనని తెలిపింది. 2030 నాటికి చంద్రునికి వెలుపల మరియు భూమిపై కార్యకలాపాలకు మధ్య కమ్యూనికేషన్ వంతెనగా పనిచేసే రిలే శాటిలైట్స్ను రూపొందించేందుకు చైనా కృషి చేస్తోంది. కొద్దీ రోజుల క్రితమే చైనా ముగ్గురు వ్యోమగాముల్ని స్పేస్ స్టేషన్కు పంపింది.