కేరళ డీజీపీగా వైయస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన దర్వేష్ సాహెబ్ బాధ్యతలు చేపట్టారు. దర్వేష్ను డీజీపీగా నియమిస్తూ కేరళా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రెండ్రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు.
పోరుమామిళ్ల పట్టణంలోని బెస్తవీధికి చెందిన దర్వేష్ ప్రాథమిక విద్య పోరుమామిళ్లలోనే పూర్తి చేశారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ ప్రైవేటు పాఠశాలలో, ఆరు నుంచి పది వరకు ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ జూనియర్ కళాశాలలో చదివారు. డిగ్రీ, పీజీలను తిరుపతిలో పూర్తి చేశారు.
జిల్లా ఎస్పీ నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ డీజీపీగా నియమితులయ్యారు. ధర్వేష్ తండ్రి అటవీశాఖలో లో ఉద్యోగం చేస్తూ గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ వెనకవైపు ఉన్న బెస్తవీధిలో నివాసం ఉండేవారు. ధర్మేష్ ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు పోరుమామిళ్ల ఓఎల్ ఎఫ్ పాఠశాలలో చదివారు. ఆరు నుండి ఇంటర్ వరకు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నారు. డిగ్రీ పీజీ తిరుపతిలో చదివారు.
ఐఏఎస్ సాధించాలని పట్టుదలతో కష్టపడి సివిల్స్ పరీక్షలకు హాజరయ్యారు. మొదటిసారి ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సెలెక్ట్ కావడంతో దాన్ని వదులుకొని మరోసారి ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యారు. ఈసారి ఐపీఎస్ కేరళ క్యాడర్ గా సెలెక్ట్ కావడంతో కేరళ రాష్ట్రంలో తన ఉద్యోగాన్ని మొదలు పెట్టారు. పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు.
డీజీపీగా దర్వేష్ నియామకంతో పోరుమామిళ్లలోని ఆయన బంధువులు, స్నేహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
