ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి భీకర పోరు సాగుతోంది. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు భీకర దాడులకు తెగబడ్డారు. శనివారం ఉదయం కేవలం 20 నిమిషాల్లోనే 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్ల వర్షం కురిపించారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్.. దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి అప్రమత్తం చేసింది.
గాజా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించిన ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రకటన చేసింది. ఏ క్షణమైన పూర్తి స్థాయి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైనం పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ భూభాగంలోకి భారీగా ఆయుధాలతో చొరబడిన హమాస్ ఉగ్రవాదులు కనిపించిన పౌరుల్ని కాల్చి పడేస్తున్నారు.
హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్ సైనికులతోపాటు పదుల సంఖ్యలో పౌరులను బంధీలుగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు నలుగురు చనిపోయారని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. మృతుల సంఖ్య భారీగానే ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా, శనివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి ఐదు వేల రాకెట్లు ప్రయోగించారు. దేవుడి సహాయంతో అన్ని సమస్యలకు ముగింపు పలకాలని నిర్ణయించినట్టు హమాస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు మహ్మద్ దీఫ్ తెలిపారు. ఆపరేషన్ ‘అల్-అక్సా ఫ్లడ్’ను ప్రకటించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా తొలి 20 నిమిషాల్లో 5,000 క్షిపణులు, షెల్స్ను ఇజ్రాయిల్పైకి ప్రయోగించినట్లు వెల్లడించారు.
మరోవైపు రాకెట్లతో హమాస్ దాడి చేయడంతో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ఎయిర్ ఢిఫెన్స్ ద్వారా హమాస్ క్షిపణులను ఎదుర్కొన్నది. అలాగే హమాస్పై యుద్ధాన్ని ప్రకటించింది. హమాస్ మిలిటెంట్లు చొరబడిన సరిహద్దు ప్రాంతాల్లో ఐడీఎఫ్ దళాలను రంగంలోకి దించింది. గాజా స్ట్రిప్ సరిహద్దులోని 80 కిలోమీటర్ల పరిధిలో ఎమర్జెన్సీ ప్రకటించింది.
ఇక దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్టులను ఇజ్రాయెల్ మూసివేయించింది. హమాస్ దాడులకు ప్రతి దాడులు చేస్తున్న ఇజ్రాయిల్ సైన్యం.. గాజా స్ట్రిప్లోని హమాస్ స్థావరాలపై దాడులు జరిపింది. ప్రత్యర్థుల రాకెట్లు కూల్చేందుకు యాంటీ రాకెట్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది.
ఇజ్రాయెల్పై మిలటరీ ఆపరేషన్ చేపట్టినట్లు హమాస్ గ్రూప్ చీఫ్ మహమ్మద్ డీఫ్ వెల్లడించారు. ఆపరేషన్ అల్ అక్సా అనే ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఇక ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఇజ్రాయెల్లోకి హమాస్ ఉగ్రవాదులు చొరబడి కాల్పులకు తెగబడుతున్నట్లు వీడియోలు బయటికి వచ్చాయి. అయితే ఎంత మంది ఉగ్రవాదులు ఇజ్రాయిల్లోకి ప్రవేశించారనేది స్పష్టంగా తెలియడం లేదు.
పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు చేపట్టిన అల్ అక్సా ఆపరేషన్కు ప్రతీకరంగా.. ఇజ్రాయిల్ దళాలు కూడా స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఆ ఆపరేషన్కు ఐరన్ స్వార్డ్స్ అని పేరు పెట్టారు. హమాస్ గ్రూపుపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయిల్ ఐరన్ స్వార్డ్స్ ఆపరేషన్ ద్వారా రిజర్వ్ దళాలను కూడా తమ సైన్యంలోకి తీసుకోనున్నది. హమాస్ ఆక్మసిక దాడికి ప్రతీకారంగా ఐరన్ స్వార్డ్స్ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయిల్ రక్షణ దశాలు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్లో ప్రస్తుతం చోటు చేసుకున్న యుద్ధ వాతావరణం వేళ భారత ప్రభుత్వం అక్కడ ఉన్న మన దేశ పౌరులకు కీలక సూచనలు చేసింది. భారతీయ పౌరులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అక్కడి అధికారులు జారీ చేసిన ప్రోటోకాల్స్ను తప్పకుండా పాటించాలని చెప్పింది. ఈ మేరకు ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన జారీ చేసింది.
ఇజ్రాయెల్లో ప్రస్తుతం దాడులు జరుగుతున్నందున ప్రతీ ఒక్కరు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని పేర్కొంది. అవసరమైతే దగ్గరలో ఉన్న బాంబ్ షెల్టర్లు, బంకర్లలోకి వెళ్లాలని సూచించింది. భారత రాయబార అధికారులతో అక్కడి భారతీయులు నిత్యం కమ్యూనికేషన్లో ఉండాలని పేర్కొంది. అత్యవసర సమయాల్లో హెల్ప్లైన్ నంబర్ +97235226748 లేదా cons1.telaviv@mea.gov.in ఈ మెయిల్లో సంప్రదించాలని ఇజ్రాయెల్లోని భారత ఎంబసీ అధికారులు కోరారు.