బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు. కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి దీమా పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించా. తెల్ల రేషన్ కార్డులు కలిగిన 93 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల సాధారణ బీమా అందిస్తామని తెలిపారు.
రైతు బీమా తరహాలోనే దీనిని అమలు చేస్తామని, సాధారణ మరణానికి కూడా బీమా వర్తింస్తుందని చెప్పారు. ఈ బీమాకు సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని, మరోసారి అధికారంలో వచ్చిన నాలుగైదు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఎల్ఐసీ ద్వారా బీమా పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద రాష్ట్రంలో ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు దీనిని వర్తింప చేయనున్నట్టుగా హామీ ఇచ్చారు. మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ఏప్రిల్- మే నుంచి దీనిని అమలు చేస్తామని చెప్పారు.
తెలంగాణలో సామాజిక పెన్షన్లు రూ. 5 వేలకు పెంచనున్నట్టుగా కేసీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత రూ. 3 వేలకు పెంచి, ప్రతి ఏడాది రూ. 500 రూపాయలు పెంచుతూ, ఐదో సంవత్సరం వరకు రూ. 5వేలకు చేరుకుంటుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వంపై ఒకేసాని భారం పడే అవకాశం ఉండదని చెప్పారు.
దివ్యాంగులకు పెన్షన్ను ఇటీవల రూ. 4 వేలకు పెంచామని, దానిని రూ. 6 వేలకు పెంచుతామని చెప్పారు. వచ్చే మార్చి తర్వాత రూ. 5 వేలకు పెంచి, ఆ తర్వాత పెంచుకుంటూ పోతామని చెప్పారు. రూ. 400లకే గ్యాస్ సిలిండర్లు అందించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.
అర్హులైన మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద మహిళలకు గౌరవ వేతనం రూ. 3,000. మేనిఫెస్టోలో రైతు బంధును రూ. 16,000, ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 15 లక్షలు. హైదరాబాద్లో పేదలకు లక్షకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన కేసీఆర్, అగ్రవర్ణాల పేదల కోసం 119 రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా ప్రకటించారు.
రు. మైనారిటీల సంక్షేమం, సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మైనారిటీ వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా మైనార్టీ జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడంతోపాటు వివిధ రంగాల్లో మైనార్టీలకు అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
