కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలు. ఒక వంక తెలంగాణాలో తామే అధికారంలోకి రాబోతున్నామని అంటుంటారు. మరోవంక ఆ పార్టీ నాయకులు ఎవ్వరి దారి వారన్నట్లు వయ్వహారిస్తున్నారు. పార్టీలో కుమ్ములాటలు కట్టడి చేయడం పార్టీ అధిష్టానంకు కూడా సాధ్యం కావడం లేదు.
తాజాగా, మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ బిసి నేత వి హనుమంతరావు, మాజీ టిపిసిసి అధ్యక్షుడు, పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య అగ్గి రాజుకుంటోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను కాంగ్రెస్ నుంచి బయటకు పంపేందుకు కుట్ర చేస్తున్నారని అంటూ వి హెచ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఉత్తమ్కుమార్ రెడ్డి అంబర్ పేట్ నియోజకవ ర్గం వెంట పడుతున్నారని పేర్కొంటూ అంబర్పేట్ సీటు తనదని ఇక్కడ వేలు పెడితే బాగొదని వి హెచ్ హెచ్చరించారు. ఉత్తమ్కుమార్ రెడ్డి అంబర్ పేట్ వెంట పడితే తాను ఆయన వెంట పడుతానని విహెచ్ తేల్చి చెప్పారు. గతంలో అంబర్పేట్ నుంచి గెలిచి తాను మంత్రి అయ్యాయని విహెచ్ గుర్తు చేశారు.
గతంలో తనపై కేసులు పెట్టిన నూతి శ్రీకాంత్ గౌడ్కు ఉత్తమ్కుమార్ రెడ్డి అంబర్ పేట్ సీటు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారని చెబుతూ అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్కు, ఆయన భార్యకు మాత్రం సీట్లు కావాలని, నాకు మాత్రం సీటు వద్దా? అంటూ విహెచ్ నిలదీశారు.
డబ్బులు తీసుకొని పోటీలో వెనక్కి తగ్గుతున్నానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విహెచ్ సీరియస్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో తన మనుషులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డిని బయటకు పంపించారని, ఇప్పుడు జగ్గారెడ్డి పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని విహెచ్ సంచలన ఆరోపణలు చేశారు.
గతంలో రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా జగ్గారెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్కుమార్ రెడ్డేనని విహెచ్ ఆరోపించారు. తాను ఎన్నటికీ పార్టీ మారనని, గాంధీ కుటుంబానికి విధేయుడినని విహెచ్ స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా పనిచేయడం ఆపకపోతే ఉత్తమ్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన పనులను బయటపెడతానంటూ విహెచ్ హెచ్చరించారు.
కాగా, పార్టీ కీలక నేత అ యిన ఉత్తమ్పై సీనియర్ నేత విహెచ్ చేసిన వ్యాఖ్య లు ప్రస్తుతం కాం గ్రెస్లో హాట్ టాపిక్గా మారాయి. బిసిలకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తదో చెప్పాలని విహెచ్ డిమాండ్ చేశారు. బిసిలను ఓట్లేసే యంత్రాలుగా భావించొద్దని ఆయన పార్టీ అధిష్టానాన్ని కూడా హెచ్చరించారు.