తెలంగాణలో పోలింగ్కు మరో 17 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. నగరంలోని పలు చోట్ల సోమవారం ఉదయం నుంచే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఓ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్, సిబ్బంది, ఇల్లు ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మెుత్తం 15 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి.
మై హోం భూజాలో ఉన్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు.. ఇప్పుడు ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసినట్లుగా సమాచారం. ఎన్నికల దగ్గరపుడతున్న వేళ రాజకీయ నాయకులకు ఫార్మా కంపెనీలు నిధులు సమకూర్చే ఉందని, అందులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలిసింది.
నాలుగు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు దాడులు చేశారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్లో ఆయన చెందిన ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు జరిగాయి. వారం క్రితం మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు పారిజాత నర్సింహ్మా రెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్, మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలోనూ ఐటీ దాడులు జరిగాయి. ఖమ్మం జిల్లాకే చెందిన తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో పోలీసుల సోదాలు జరిగాయి.