తెలంగాణ క్యాబినేట్లో కొత్తగా కొలువుదీరిన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. శాఖల కేటాయింపు కోసం హస్తిన వెళ్లిన ఆయన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్లతో చర్చలు జరిపినంతరం శనివారం మంత్రులకు శాఖలు కేటాయించారు.
కీలకమైన హోంశాఖ, సాధారణ పరిపాలన, మున్సిపల్, విద్య, ఎస్సీ, ఎస్టీ శాఖలతో పాటు కేటాయించని శాఖలు తన వద్దే ఉంచుకున్నారు. 11 మంది మంత్రులకు వివిధ శాఖలు అప్పగించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆర్ధిక, విద్యుత్, ఉత్తమ్కుమార్రెడ్డికి నీటిపారుదల, పౌరసరఫరాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎంపిక చేశారు.
డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క : ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి : నీటి పారుదల, పౌరసరఫరాలు
దామోదర రాజనర్సింహ : వైద్యం, ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి : రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ
దుద్దిళ్ల శ్రీధర్ బాబు : ఐటీ, శాసన సభా వ్యవహారాలు, పరిశ్రమలు
పొంగులేటి : రెవెన్యూ, గృహనిర్మాణం, ఐ అండ్ పిఆర్,
పొన్నం ప్రభాకర్ రావు : రవాణా శాఖ, బిసి సంక్షేమం
కొండా సురేఖ : అటవీ, పర్యావరణ, దేవాదాయ
దనసూరి సీతక్క : పంచాయతీరాజ్, మాతా శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి
తుమ్మల నాగేశ్వర్ రావు : వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, టెక్స్ టైల్స్
జూపల్లి కృష్ణారావు : ఎక్సైజ్, పర్యాటక శాఖ
సలహాదారుల నియామకాలు రద్దు
మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన ఏడుగురు సలహాదారులను తొలగిస్తూ నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
వీరిలో ముఖ్యమంత్రి సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, మైనారిటీ సంక్షేమ సలహాదారు ఏకే ఖాన్, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, పోలీస్ లా అండ్ ఆర్డర్, క్రైమ్ కంట్రోల్ అడ్వైజర్ అనురాగ్ శర్మ, వ్యవసాయ ముఖ్య సలహాదారు చెన్నమనేని రమేశ్, అటవీ వ్యవహారాల సలహాదారు ఆర్ శోభ ఉన్నారు.