దేశంలోని డ్రైవర్ల ఉద్యోగాల భద్రత దృష్ట్యా డ్రైవర్ లెన్ కార్లను భారత్లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఐఐఎం నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అదేవిధంగా కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్ల ఏర్పాటు, రోడ్లపై బ్లాక్ స్పాట్లను తొలగింపు లాంటి చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఒక ఫ్రేమ్వర్క్ను రూపొందించామని తెలిపారు.
ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇక హైడ్రోజన్ను భవిష్యత్తు ఇంధనంగా నితిన్ గడ్కరీ అభివర్ణించారు.
ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గడ్కరీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై మూలధన వ్యయం 2013-14లో రూ.51 వేల కోట్లు ఉండగా.. 2022-23లో రూ.2.40 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 2013-14లో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు రూ.31,130 కోట్లు కాగా, 2023-24 నాటికి ఇది రూ.2,70,435 కోట్లకు పెరిగిందని మంత్రి చెప్పారు.