తెలంగాణలో డిసెంబర్ 26 నుండి జనవరి 10, 2024 వరకు పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై ట్రాఫిక్ పోలీసులు రాయితీ ప్రకటించారు. రూ. 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాలపై పెండింగ్లో ఉన్న చలాన్లను ఈ-చలాన్ వెబ్సైట్ ద్వారా రాయితీ ఉన్నంత వరకు క్లియర్ చేయాలని సూచించారు. చలాన్లపై గతం కంటే పోలీసులు ఈసారి ఎక్కువ రాయితీ ప్రకటించారు. ట్రాఫిక్ చలాన్లపై తగ్గింపులు వాహనం యొక్క వర్గం ప్రకారం విభజించారు.
ఉదాహరణకు, ఒకరు 1000 రూపాయలు చెల్లించవలసి వస్తే, వారు మొత్తంలో 25% అంటే 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. చెల్లింపు పూర్తయిన తర్వాత, మిగిలిన మొత్తం స్వయంచాలకంగా మాఫీ చేయబడుతుంది.
* ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 20 శాతం చలాన్ చెల్లిస్తే మిగిలిన 80 శాతం పెండింగ్ చలాన్లు మాఫీ అవుతాయి.
* తోపుడు బండ్లు, చిన్న వ్యాపారులకు (39బి కేసులు), ట్రాఫిక్ చలాన్లో 10% చెల్లించినట్లయితే, మిగిలిన 90% తగ్గింపు లేదా మాఫీ చేయబడుతుంది.
* తేలికపాటి మోటారు వాహనాలు (ఎల్ఎంవి), కార్లు, జీపులు, భారీ వాహనాలకు 40% చెల్లిస్తే, మిగిలిన 60% మాఫీ అవుతుంది.
* రోడ్డు రవాణా సంస్థ (ఆర్ టి సి) డ్రైవర్లకు, ట్రాఫిక్ చలాన్ చలాన్లో 10% చెల్లిస్తే, మిగిలిన 90% తగ్గింపు లేదా మాఫీ చేయబడుతుంది.
2022, ఫిబ్రవరి నెలలో పెండింగ్ చలాన్లపై నాటి ప్రభుత్వం రాయితీ కల్పించిన సంగతి తెలిసిందే. రెండు, మూడు చక్రాల వాహనాలకు 75 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, లైట్, హెవీ మోటారు వాహనాలకు 50 శాతం, తోపుడు బండ్లకు 75 శాతం రాయితీ ఇచ్చారు. నాడు రూ. 300 కోట్ల వరకు పెండింగ్ చలాన్లపై వసూళ్లు అయ్యాయి