తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్లోదరఖాస్తులు స్వీకరించనున్నారు. గతంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది.
2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్ను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది. సరైన నిబంధనలను పాటించకపోవడంతో రెండోసారి ప్రిలిమ్స్ను రద్దయ్యాయి.
ఇటీవల మరో 60 గ్రూప్-1 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత నోటిఫికేషన్లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు కొత్తగా కలిపి 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆన్లైన్లో అప్లికేషన్ల దరఖాస్తుల స్వీకరణ – ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు
అప్లికేషన్లు ఎడిట్ చేసుకునే అవకాశం- మార్చి 23 నుంచి 27 వ తేదీ వరకు
ప్రిలిమినరీ పరీక్ష – మే/జూన్ 2024
మెయిన్స్- సెప్టెంబర్/అక్టోబర్ 2024
కాగా, తాజా నోటిఫికేషన్లో అభ్యర్థుల వయస్సును 44 నుంచి 46కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మే లేదా జూన్లో ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, గతంలో దరఖాస్తు చేసినవారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో గ్రూప్-1 కు దరఖాస్తు చేసుకున్న వారు కూడా మరో మారు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ ప్రకటనలో స్పష్టం చేసింది.