రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కర్నూల్లో హైకోర్టు పెట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. వికేంద్రీకరణ గురుంచి మాట్లాడే అధికారం జగన్కి లేదని పేర్కొంటూ విశాఖను స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం అభివృద్ధి చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీది అని, కుటుంబ పార్టీలది కాదని తేల్చి చెప్పారు.
వికేంద్రీకరణకు కేంద్రం కట్టుబడి పనిచేస్తోందని చెబుతూ. రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచులకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వీర్రాజు విమర్శించారు. అనంతపురంలో అధిక వర్షాలకు పంట వేసిన రైతులు నష్టపోయారని, చెరువు కట్టలు తెగిపోయి పంటలు పాడయ్యాయని విచారం వ్యక్తం చేశారు.
అనంత నగరం వరదల్లో మునిగితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమసించారు. రూ.20 వేల కుటుంబాలు ముంపుకి గురయ్యాయని, రూ. 30,000 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు. అనంత నష్టంపై ఎమ్మెల్యే, ఎంపీ ప్రకటించకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు.
విశాఖకు వంద కోట్లు కూడా జగన్ ఖర్చుపెట్టలేదని ఆయన మండిపడ్డాయిరు. క్యాప్టల్ అంటే విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని పేర్కొంటూ అమరావతి రాజధానిగా ఉంటే, కర్నూల్లో హైకోర్టు పెట్టడానికి బీజీపీ కట్టుబడి ఉందని వీర్రాజు స్పష్టం చేశారు.
కుటుంబ పార్టీల మూలంగా అభివృద్ధి లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆయన విమర్శించారు. రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు పాలించినా, శ్రీభాగ్ ఒడంబడిక అమలు కాలేదని ఆయన మండిపడ్డాయిరు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటుకు గత రెండు ప్రభుత్వాలే కారణమని స్పష్టం చేశారు.
ఐదేళ్లుగా కేంద్రం వెనుకబడిన జిల్లాలకు రూ. 350 కోట్లు ఇచ్చిందని వీర్రాజు తెలిపారు. మంత్రులు పర్యటించి నిధుల వినియోగంపై నివేదికలు తీసుకున్నారని తెలిపారు. కర్నూల్లో ఎయిర్ పోర్ట్ సహా రూ.కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు కేంద్రం చేపట్టిందని చెప్పారు.
అనంతలో బెల్ సంస్థ సహా అనేక ప్రాజెక్టులు తెచ్చామని ఆయన తెలిపారు. సత్యసాయిలో నాసిన్, కియా సంస్థలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.