జమ్ముకశ్మీర్లోని సిధ్రా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు ఉదయం 7.30 గంటలకు సిధ్రా ప్రాంతంలోని ఓ ట్రక్కులో నక్కిన ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా సైనికులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని జమ్ము ఏడీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు. వారిని గుర్తించాల్సి ఉందన్నారు.
కాగా, ఉధంపూర్ జిల్లాలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఒక రోజు తర్వాత ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. సోమవారం ఉధంపూర్ జిల్లాలోని బసంత్గఢ్ ప్రాంతంలో 15 కిలోల ఐఈడీ, 400 గ్రాముల ఆర్డీఎక్స్, ఐదు డిటోనేటర్లు, 7.62 ఎంఎం కాట్రిడ్జ్లు ఏడింటిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
సిధ్రాలో ట్రక్ కదలికలు అనుమానాస్పదం ఉండటంతో దానిని అనుసరించామని ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. సిధ్రా వద్ద ట్రక్కును ఆపిన సమయంలో ..డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని..ఆ తర్వాత ట్రక్కులో దాక్కున్న ఉగ్రవాదులు తమపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. తాము కూడా కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఎన్ కౌంటర్ ముగిసిందని..ఇక్కడ ఇంకా 23 మంది వరకు ఉగ్రవాదులున్నారని తెలిపారు. వారి దగ్గర భారీగా ఆయుధాలు ఉన్నాయన్నారు.