ఎలుకల్లో కరోనా వైరస్ సంక్రమించవచ్చని అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ సిటీ ఎలుకలకు కరోనా వైరస్ సంక్రమించవచ్చని అధ్యయనం కనుగొంది. న్యూయార్క్ నగరంలో మొత్తం 8 మిలియన్ల ఎలుకలు ఉన్నాయి.
ఇవి ప్రజలతో కాంటాక్ట్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. న్యూయార్క్ ఎలుకలు సార్స్ కోవ్-2 యొక్క ఆల్పా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లకు పాజిటివ్ గా పరీక్షించబడ్డాయి. మొత్తం 79 ఎలుకల్లో 16.5 శాతం ఎలుకలకు కరోనా సోకినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఎలుకలకు కరోనా సోకుతుందని నిరూపించిన తొలి ప్రయోగం ఇదే అని అన్నారు. అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ యొక్క ఓపెన్-యాక్సెస్ జర్నల్ ఎంబియోలో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
అయితే, కోవిడ్ సోకిన ఎలుకలకు ఎలా కరోనా సోకింది..? ఇది మానవులకు ప్రమాదాన్ని తీసుకువస్తుందా..? అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ వైరస్ ఎలుకల్లో కొత్త వేరియంట్ల పరిణామం చెందుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని డాక్టర్ హెన్రీ వాన్ చెప్పారు.
మానవులను ప్రభావితం చేసే మహమ్మారిలో జంతువుల ప్రముఖ పాత్రను పోషిస్తాయని ఈ ప్రయోగం ద్వారా వెల్లడైందని అధ్యయన వేత్తలు చెప్పారు. అయితే గబ్బిలాల వంటి క్షీరదాల వల్ల ప్రజలకు వైరస్ వ్యాప్తి చెందుతుందని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.
అయితే ఇది అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతుందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తెలిపింది. దీనికి ముందు హాంకాంగ్, బెల్జియంలో ఎలుకలపై చేసిన అధ్యయనాల్లో అవి వైరస్ ఇన్ఫెక్షన్లకు గురైనట్లు కనుగొన్నారు. పిల్లులు, కుక్కలు, గొరిల్లాలు, హిప్పోలు, జింకలు, యాంట్ఈటర్స్లో కరోనా వైరస్ సోకినట్లు నివేదికలు గుర్తించాయి.