మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ మార్పిడితో కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వసంత్కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల. ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వసంతకుమార్ పని చేశారు.
2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య , కిరణ్ కుమార్రెడ్డి హయాంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
2009లో రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వసంత్ కుమార్ పనిచేశారు. రోశయ్య క్యాబినెట్లోనూ గ్రామీణాభివృద్ధి మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ- కాంగ్రెస్ కలయిక తర్వాత హస్తంపార్టీకి ఆయన గుడ్ బై చెప్పేశారు.
2014 నుంచి కాంగ్రెస్ పార్టీతో పాటు.. రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య.. జనసేన అధినేత పవన్ కల్యాణ్తో వసంత్ కుమార్ భేటీ కావడంతో ఆ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. పవన్ కల్యాణ్తో తాను రాజకీయాలేమీ చర్చించలేదని, మర్యాద పూర్వకంగానే తను కలిశానని చెప్పారాయన.