ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
1949 జూన్ 1న ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించారు. ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా సేవలందించారు. గుమ్మడి కుతూహలమ్మ 1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశారు. 1980 – 85 మధ్య చిత్తూరు జడ్పీ చైర్పర్సన్ గా విధులు నిర్వహించారు. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు
చాలా ఏళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నారు. 2014లో తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సుమారు ఏడాదిన్నర క్రితం టీడీపీకు రాజీనామా చేశారు. 1985లో వేపంజేరి (ప్రస్తుతం జీడీనెల్లూరు) నియోజకవర్గం నుంచి గుమ్మడి కుతూహలమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి హయాంలో వైద్యారోగ్య, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. 2007లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గానూ పని చేశారు.
1994లో కాంగ్రెస్ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆమె టీడీపీలో చేరారు. జీడీనెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.