లైఫ్సైన్సెస్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఔషధ ఉత్పత్తిలో ఆసియాలోనే హైదరాబాద్ అతిపెద్ద నగరమని చెప్పారు. ఈ రంగంలో హైదరాబాద్కు 7 ఏళ్లలో రూ.25 వేల కోట్లు వచ్చాయని, ఇక్కడ 800కు పైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలున్నాయని కేటీ ఆర్ తెలిపారు.
హైదరాబాద్లోని హెచ్ఐసీసీ లో మూడు రోజుల పాటు జరుగనున్న బయో ఆసియా-2023 సదస్సును శుక్రవారం ఫార్మారంగ దిగ్గజ కంపెనీల సీఈవోలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోని టాప్-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగా ణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొ న్నారు.
2030నాటికి లైఫ్సైన్సెస్ రంగం విలువ రెట్టింపు చేసి 100బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే 2022లోనే 80బిలియన్ డాలర్ల విలు వకు చేరుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో లక్ష్యాన్ని సవరించి 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల విలువకు పెంచామని చెప్పారు. 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని 2025లోనే చేరుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
లైఫ్సైన్సెస్ రంగం గడిచిన రెండేళ్లలో 23 శాతం వృద్ధి నమోదు చేసుకుందని చెప్పా రు. తెలంగాణ ఇప్పటికే లైఫ్సైన్సెస్, ఫార్మా రంగ ఎకో సిస్టమ్కు నిలయంగా ఉందని చెప్పారు. ప్రపంచంలోనే మూడింట ఒక వంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరు గుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశీయ ఔషద ఎగుమతుల్లతో 30శాతం, ఏపీఐ ఉత్పత్తిలో 40శాతం, ఏపీఐ ఎగుమ తుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతు న్నదని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో 20కి పైగా లైఫ్సైన్సెస్, మెడ్టెక్ ఇంక్యుబేటర్లు ఉన్నాయని అవార్డును ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్కు అందజేయనున్నామని చెప్పారు. హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందని, లైఫ్సైన్సెస్ రంగంలో ప్రపంచ హబ్గా హైదరాబాద్ అవతరించిందని తెలిపారు.