ఉక్రెయిన్పై అణ్వాయుధ దాడి చేయకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ను చైనా, భారత్లు ఆపి ఉండొచ్చునని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ భారత్, చైనాలు అడ్డుపడి ఉండకపోతే బహుశా యుద్ధాన్ని ముగించేయడానికి రష్యా అణ్వాయుధాలు ప్రయోగించి ఉండేదని పేర్కొన్నారు. ఆయన ‘ది అట్లాంటిక్’కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం చెప్పారు.
‘భారత్, చైనాలు అడ్డుపడి ఉండకపోతే వ్లాదిమీర్ పుతిన్ మరింత రెచ్చిపోయి ఉండేవాడు, మాస్కో నుంచి వెలువడిన హెచ్చరికల తీవ్రత అలా ఉండింది…పుతిన్ అణ్వాయుధాలు వాడి ఉండేవాడు’ అని ఆయన చెప్పారు. ‘రష్యాను నివారించమని మేము కోరాము. ఆ విషయంలో కొంత విజయం సాధించామనే అనుకుంటున్నాము. భారత్, చైనాలు రష్యాను నివారించాయి. భారత్, చైనాల ప్రభావం కొంత మేరకు పనిచేసిందనే అనుకుంటున్నాము’ అని ఆయన వివరించారు.
భారత్తో రష్యాకు దశాబ్దాలుగా స్నేహ సంబంధాలున్నాయి, అయితే ఇప్పుడు అమెరికాతో, ఫ్రాన్స్తో కూడా భారత్ స్నేహసంబంధాలను వృద్ధి చేసుకుందని ఆయన చెప్పారు,
జిన్పింగ్తో శాంతి చర్చలకు సిద్ధమన్న జెలెన్స్కీ
కాగా, ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించేందుకు శాంతి చర్చల కోసం చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ను భేటీ కావాలనుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు. రష్యాకు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ఆయుధాలను రష్యాకు పంపకపోవచ్చని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు.
ప్రపంచ యుద్ధాన్ని తప్పించేందుకు, రష్యాకు చైనా ఆయుధాలు సరఫరా చేయకుండా ఉండే అంశంపై ఆ దేశ అధ్యక్షునితో చర్చిస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే చైనా చేసిన శాంతి ప్రతిపాదనలో ఉక్రెయిన్ నుంచి రష్యా దళాల ఉపసంహరణపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. జిన్ పింగ్ ను కలిసేందుకు జెలెన్సీ సిద్ధంగా ఉన్నా.. అటు చైనా మాత్రం ఇంకా ఈ అంశంపై స్పందించలేదు. మరోవైపు చైనా శాంతి ప్రతిపాదనను రష్యా స్వాగతించింది.