2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు టెక్నాలజీ సహాయపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలిపారు. డిజిటల్ విప్లవం ప్రయోజనాలు పౌరులందరికీ చేరేలా చూసేందుకు రూపొందించనున్న భారీ, ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాల గురించి ప్రధాని వివరించారు.
అన్లీషింగ్ ది పొటెన్షియల్. ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీపై బడ్జెట్ అనంతర వెబ్నార్లో ప్రధాని మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తగ్గించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిన్న వ్యాపారాల ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి కంపెనీ చేసే వ్యయం తగ్గించాలని కోరారు.
చిన్న వ్యాపారాల వ్యయాన్ని తగ్గించాలనుకుంటున్నామని చెబుతూ ఈ మేరకు జాబితాను రూపొందించాలని చెప్పారు. భారతదేశం ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోందని, డిజిటల్ విప్లవం ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికి చూస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు.
5జి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికత వైద్యం, విద్య, వ్యవసాయం అనేక ఇతర రంగాలకు దోహదపడేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సాంకేతికతను జోడించడం వల్ల వన్ నేషన్ వన్ రేషన్కు ఆధారం ఏర్పడిందని, పేదలకు ప్రయోజనాలను అందించడంలో జెఎఎం యోజన, ఆధార్, మొబైల్ నంబర్) దోహదపడినట్లు తెలిపారు.