టీఎస్పీఎస్సీ కార్యాలయం లోని పరీక్షల సంబంధిత కంప్యూటర్ హ్యాక్ కావడంతో సోమవారం జరగాల్సిన టీపీబీవో పోస్టులకు నిర్వహించాల్సిన రాతపరీక్షను, ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాతపరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
ఈ పరీక్షలకు సంబంధిత కంప్యూటర్ హ్యాక్ అయిందని అనుమానం ఉందని, ఈ మేరకు హ్యాకింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టిఎస్పిఎస్సి తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని స్పష్టం చేసింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను మళ్లీ ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
అధికారిక వెబ్సైట్లతో పాటు.. పరీక్ష రాసే అభ్యర్థులందరికీ మెస్సేజ్లు పంపించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు హామీ ఇచ్చారు. కాగా.. టీఎస్పీఎస్సీ చరిత్రలో ఇలా జరగటం ఇదే మొదటి కావటం గమనార్హం. అయితే.. నిజంగానే పేపర్లు హ్యాకింగ్కు గురయ్యాయా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.