ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి మార్గదర్శిపై సిఐడి సోదాలు చేపట్టింది.కొంతకా లం నుంచి ఖాతాదారుల సొమ్ము మళ్లించినట్టు మార్గదర్శిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిధుల మ ళ్లింపుపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సిఐడికి ఫిర్యాదు చేయడంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు.
ఈ మేరకు మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావుపై సిఐడి కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఎండి చెరుకూరి శైలజ, పలు బ్రాంచ్ మేనేజర్లపై కూడా కేసు పెట్టారు. ఎ1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు, ఎ2గా చెరుకూరి శైలజ, ఎ3గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లపై సెక్షన్ 120 బి,409, 420, 477(a) రెడ్ వి త్ 34 ఆఫ్ ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సెక్షన్ 5, ఎపి ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కేసు నమోదుతో పాటు 1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లల్లో సిఐడి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే విజయవాడలో మార్గదర్శి మేనేజర్ శ్రీనివాస్ను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకోవడంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే ఎపి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాలపై సిఐడి, జీఎస్టీ, ఎన్ఫోర్స్ మెంట్, రిజిస్ట్రేషన్ శాఖ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు అక్రమాలు బయటకు వచ్చాయని కూడా అధికారులు వెల్లడించారు.
చిట్ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి డబ్బును దారి మళ్లిస్తున్నట్టు తేల్చారు. ఆ డబ్బును వడ్డీలకు ఇవ్వడం, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం వంటి వాటికి పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హర్డ్డిస్క్ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.