విశాఖపట్నం వేదికగా నేటి నుంచి 3 రోజుల పాటు- జి-20 సదస్సు నిర్వహించనున్నారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ,వన్ ఫ్యూచర్ అనే థీమ్తో..నగరంలోని రుషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో ఈ నెల 28,29,30వ తేదీల్లో జీ-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో సోమవారం నుంచే వివిధ దేశాల నుంచి ప్రతినిధుల రాక ప్రారంభమైంది.
సదస్సు ద్వారా విశాఖనగరానికి మరోసారి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. జి-20దేశాలకు ఇండియా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక జీ-20 సదస్సు ఏడాది డిసెంబర్లో ఇండియాలో జరగనుంది. ఈలోగా వివిధ రంగాలకు సంబంధించిన వర్కింగ్ గ్రూప్ సమావేశాలు దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి.
దీంట్లో భాగంగా ఈ నెల 3,4తేదీల్లో జాతీయ స్థాయిలో పుణేలో జరిగిన తొలిదశ జీ-20ఇన్ఫ్రాక్చర్ వర్కింగ్ గ్రూప్ సదస్సు విజయవంతమైంది.మలివిడత జీ-20 శిఖరాగ్ర సదస్సుకు మహావిశాఖనగరం అతిథ్యం ఇస్తోంది. 40దేశాల నుంచి 200మంది వరకూ దేశవిదేశీ ప్రతినిధులు, పలుదేశాల ఆర్ధిక మంత్రులు, విదేశాంగ మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
కేంద్ర ప్రత్యేక కార్యదర్శి శాల్మన్ ఆరోగ్యరాజ్, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ ఈ సదస్సుకు సంబంధించి అధికారుల బృందంకు నాయకత్వం వహించి ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. సదస్సులో సీఎం జగన్తో సహా కేంద్ర మంత్రులు, కేంద్ర ఉన్నతాధికారులు, ఇతర రాష్ట్రాల్రకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. డిజిటల్ ఇండియా..హరిత అభివృద్ధితో పాటు-గా మహిళా సాధికారత,యువతకు అవకాశాలు, రైతు అంశాలతో సదస్సులు నిర్వహణకు నిర్ణయించారు.