మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కాగా నటుడు పోసాని కృష్ణ మురళి కరోనా బారిన పడ్డారు.ఆయన ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.దీంతో హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేరారు పోసాని కృష్ణ మురళి.
సినిమా షూటింగ్ కోసం పుణె వెళ్లిన ఆయన గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. దగ్గు, జలుబుతోపాటు కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. గతంలో కూడా పోసాని కృష్ణమురళీకి సోకిన సంగతి తెలిసిందే! ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. పోసాని కృష్ణ మురళి. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా చిత్రసీమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
కాగా..తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది.
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్టాపిక్గా నిలిచే పోసాని కృష్ణమురళి.. వారం రోజుల క్రితం నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నంది పురస్కారలపై అనేక అపోహలున్నాయని.. కులాలు, గ్రూపులుగా అవార్డులు పంచుకున్నారని చెప్పారు. అవి నంది అవార్డులు కాదు కమ్మ అవార్డులని, కమిటీలో ఉన్న 12మంది సభ్యుల్లో 11మంది కమ్మవారే. అలా తనకు వచ్చిన కమ్మ నంది అవార్డును వద్దనుకున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెంపర్ సినిమాలో పోసాని నటనకు నంది వరించింది. అయితే ఆ అవార్డును పోసాని తిరస్కరించాడు.