తన హయాంలో రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి రూ. 300 కోట్ల లంచం ఇవ్వజూపారని చేసిన ఆరోపణలపై ప్రశ్నించేందుకు సిబిఐ జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్ను పిలిచింది. ‘ఓ కేసులో కొన్ని విషయాలపై స్పష్టీకరణ కోసం సిబిఐ నన్ను హాజరు కమ్మని కోరింది. నా వీలును బట్టి ఏప్రిల్ 27 లేక 28 తేదీల్లో హాజరుకమ్మని కోరింది’ అని సత్యపాల్ మలిక్ తెలిపారు.
2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్గా ఉన్న కాలంలో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు సంబంధించిన మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కు సంబంధించిన స్కామ్ ఇది.
దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకంలో జాయిన్ అయ్యారు. అయితే ఇందులో అవకతవకలు జరిగాయని అప్పుడు గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఒక్క నెలలోనే ఈ కాంట్రాక్ట్ ను రద్దు చేశారు. ఈ కేసులో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో పాటు ట్రినిటీ రీఇన్స్యూరెన్స్ బ్రోకర్లను సీబీఐ నిందితులుగా పేర్కొంది.
కాగా, ఈ సందర్భంగా రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి తనకు రూ. 300 కోట్లు లంచం ఇవ్వజూపారని ఆయన ఆరోపించారు. ఓ స్కీమ్ను ఆమోదించేందుకు ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకుడు రామ్ మాధవ్ తనకు డబ్బు ఇవ్వజూపారని పేర్కొన్నారు. అయితే, ఆ ఆరోపణలను రామ్ మాధవ్ నిరాధారం అని కొట్టిపారేశారు. పైగా ఆయన సత్యపాల్ మలిక్పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విషయమై గత ఏడాది అక్టోబర్లో సత్యపాల్ మలిక్ను సిబిఐ ప్రశ్నించింది.
గత ఏడాది ఏప్రిల్లో సిబిఐ అవినీతి ఆరోపణలపై సత్యపాల్ మలిక్పై రెండు ఎఫ్ఐఆర్లను కూడా నమోదుచేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాంట్రాక్టును ఇవ్వడంలో, కిరు హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుకు రూ. 2200 కోట్ల సివిల్ వర్క్ను ఇవ్వడంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసింది.