తైవాన్ చుట్టూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) గురువారం పెద్ద ఎత్తున విన్యాసాలు ప్రారంభించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో రెండు రోజుల పాటు చైనా-రష్యా చేపట్టిన సంయుక్త వైమానిక వ్యూహాత్మక గస్తీ ముగిసిన వెంటనే ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి.
తైవాన్ జలసంథి ప్రాంతంలో అమెరికా కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలు పెరుగుతును నేపథ్యంలో చైనా ఇటీవల గస్తీ చర్యలు, సైనిక విన్యాసాలు చేపట్టింది. గురువారం ఉదయం తైవాన్ దీవికి వాయవ్యంగా గల జలాల్లో పిఎల్ఎకి చెందిన 37 విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి.
వీటిలో జో11, జో16 యుద్ధ విమానాలు వునాయి. హెచ్ బాంబర్లు, వైయుా20 ట్యాంకర్ విమానాలు వునాుయి. వీటిల్లో కొనిు దీవికి తూర్పు వైపున గల బషి చానల్ ద్వారా పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలోకి ప్రవేశించాయని చైనా రక్షణ అధారిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది.
తైవాన్ దీవి చుట్టూ ప్రతి రోజూ సాగించే గస్తీలు, విన్యాసాలకు అదనంగా ఇవి చోటు చేసుకున్నాయి. అంతకు రెండు రోజుల ముందు పలు యుద్ధ విమానాలతో చైనా రష్యా సాగించిన విన్యాసాల కనాు విస్తృత స్థాయిలోనే ఈ విన్యాసాలు వున్నట్లు పరిశీలకులు తెలిపారు.
మొత్తంగా బుధవారం నాటి సంయుక్త గస్తీ విన్యాసాల్లో 22చైనా, రష్యా విమానాలు పాల్గొన్నాయి. ఇదొక రికార్డు. అయితే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఈ వ్యూహాత్మక గస్తీ నిర్వహించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శౄఖ గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఏ ఒక్క దేశానిు లక్ష్యంగా పెట్టుకునివీటినినిర్వహించలేదనిస్పష్టం చేసింది. ఈ విన్యాసాలపై జపాన్ దౌత్య మార్గాల ద్వారా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన విడుదల చేసింది.