తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన ప్రార్ధనామందిరాలు గుడి, మసీదు, చర్చిలను గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్తో కలిసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శుక్రవారం ప్రారంభించారు. ఉద్యోగుల కోసం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన వివిధ మతాల ఆలయాలు, ప్రార్థనా మందిరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్తో కలిసి దర్శించుకున్నారు.
తొలిసారి సచివాలయానికి వచ్చిన గవర్నర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం తెలిపారు. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్కు ఆహ్వానం పంపకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఆలయాల ప్రారంభోత్సవానికి గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి హాజరయ్యారు. వారివెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, పలువురు మంత్రులు ఉన్నారు.
మసీదులో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణలో మతసామరస్యం, శాంతిభద్రతలను కాపాడేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చెప్పారు. గతంలో నిజాం కాలంలో నిర్మించిన మసీదు కంటే మెరుగైన మసీదు నిర్మించామని ఆయన పేర్కొన్నారు. మూడు ప్రార్థనా మందిరాల నిర్మాణం మత సామరస్యానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచిందన చెబుతూ ఇది ప్రతిచోటా జరగాలని సూచించారు.
ముగ్గురు సహోదరులు కలిసి పని చేయడం, ప్రార్థన చేయడం శాంతి సామరస్యంతో జీవించడం ఎలా అనేదానికి మేము ఉత్తమ ఉదాహరణగా నిలిచాము. దీని నుంచి యావత్ భారతదేశం పాఠాలు నేర్చుకోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్కు ఆహ్వానం పంపకపోవడం అప్పట్లో వివాదంగా మారింది. తాజాగా ఆలయాల ప్రారంభోత్సవానికి గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి హాజరయ్యారు. మసీదు ప్రారంభోత్సవంలో రాష్ట్ర హోంమంత్రి మెహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణ అసెంబ్లీలో ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మత పెద్దలు పాల్గొన్నారు.
అంతకుముందు ఆలయాన్ని, చర్చిని గవర్నర్, కేసీఆర్ ప్రారంభించారు. వచ్చిన వెంటనే నల్ల పోచమ్మ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన కాంప్లెక్స్ను ప్రారంభించిన తర్వాత గవర్నర్ సచివాలయానికి రావడం ఇదే తొలిసారి. చర్చిని ప్రారంభించేందుకు గవర్నర్, ముఖ్యమంత్రి కేక్ కట్ చేశారు.
ఆలయ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలను బుధవారమే మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. గురువారం స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హోమం, మహాస్నపనం( తిరుమంజనం), వేద పారాయణం, మహాలక్ష్మీ యాగము, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
శుక్రవారం చండీయాగం, ప్రాణప్రతిష్ఠాపన హోమం, ధ్వజస్తంభ, యంత్ర, విగ్రహాల ప్రతిష్ఠ, వేదోక్తంగా ప్రాణప్రతిష్ఠ, మూడు ఆలయాల శిఖర కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో నల్లపోచమ్మ, శివుడు, ఆంజనేయస్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. సచివాలయంలో నిర్మించిన చర్చి, మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారుర.
రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. 2021లో పాత సెక్రటేరియట్ భవనాల కూల్చివేత సమయంలో మసీదు, దేవాలయం ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. శిథిలాలు పడటం వల్ల ప్రార్థనా స్థలాలు పాడైపోయాయని, ప్రభుత్వ ఖర్చుతో మరింత విశాలమైన ప్రదేశాల్లో ప్రార్థనా మందిరాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు.