అసెంబ్లీ పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మెుత్తం 52 మందితో తొలి జాబితాను రిలీజ్ చేసింది. లిస్టులో బీసీలతో పాటు సీనియర్లకు స్థానం కల్పించారు. ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపూరావు, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగుతున్నారు.
హుజారాబాద్తో పాటు సీఎం పోటీ చేసే గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేసే మరో స్థానం కామారెడ్డి నుంచి వెంకట రమణారెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేయగా ఆయన మరోసారి గోషామహల్ నుంచి పోటీ చేయనున్నారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక నుంచి బరిలోకి దిగనున్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్పై రాణి రుద్రమ రెడ్డి పోటీ చేయనున్నారు.
తొలి జాబితాలో బీసీలు, మహిళలకు పెద్దపీట వేశారు. 20 మంది బీసీలు, 12 మంది మహిళలకు చోటు కల్పించారు. 8 మంది ఎస్సీలు, ఆరుగురు ఎస్సీలకు అవకాశమిచ్చారు. ఇక తొలి జాబితాలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పేరు లేదు. వీరు అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తారని తెలుస్తుంది.
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ పేర్లు కూడా తొలి జాబితాలో లేవు. వారు పోటీ చేసే స్థానాలపై కొంత సందిగ్ధత ఉందని, అది తొలిగిన తర్వాత రెండో లిస్టులో వీరి పేర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.
- సిర్పూర్ – పాల్వాయి హరీశ్ బాబు
- బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి
- ఖానాపూర్ (ఎస్టీ) – రమేశ్ రాథోడ్
- ఆదిలాబాద్ – పాయల్ శంకర్
- బోథ్(ఎస్టీ) – బాపూరావ్
- నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి
- ముథోల్ – రామరావు పటేల్
- ఆర్మూర్ – రాకేశ్ రెడ్డి
- జుక్కల్ (ఎస్సీ) – టి. అరుణతార
- కామారెడ్డి – వెంకటరమణారెడ్డి
- నిజామాబాద్ అర్బన్ – సూర్యనారాయణ గుప్తా
- బాల్కొండ – అన్నపూర్ణమ్మ
- కోరుట్ల – ధర్మపురి అర్వింద్
- జగిత్యాల – బోగా శ్రావణి
- ధర్మపురి(ఎస్సీ) – ఎస్ కుమార్
- రామగుండం – సంధ్యారాణి
- కరీంనగర్ – బండి సంజయ్ కుమార్
- చొప్పదండి(ఎస్సీ) – బొడిగే శోభ
- సిరిసిల్ల – రాణి రుద్రమ రెడ్డి
- మానకొండూరు (ఎస్సీ) – ఆరెపల్లి మోహన్
- హుుజురాబాద్ – ఈటల రాజేందర్
- నర్సాపూర్ – ఎర్రగొల్ల మురళీ యాదవ్
- పటాన్ చెరు – నందీశ్వర్ గౌడ్
- దుబ్బాక – రఘునందన్ రావు
- గజ్వేల్ – ఈటల రాజేందర్
- కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్
- ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్
- మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్
- ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి
- కార్వాన్ – అమర్ సింగ్
- గోషామహల్ – రాజాసింగ్
- చార్మినార్ – మేఘా రాణి
- చంద్రాయణగుట్ట – సత్యనారాయణ ముదిరాజ్
- యాకుత్ పుర- వీరేందర్ యాదవ్
- బహుదూర్ పుర – వై నరేశ్ కుమార్
- కల్వకుర్తి – టి. ఆచారి
- కొల్లాపూర్ – సుధాకార్ రావు
- నాగార్జున సాగర్ – నివేదితా రెడ్డి
- సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు
- భువనగిరి – గూడురు నారాయణ రెడ్డి
- తుంగతుర్తి(ఎస్సీ) – కడియం రామచంద్రయ్య
- జనగాం – దశ్మంథ్ రెడ్డి
- స్టేషన్ ఘన్ పూర్(ఎస్సీ) – విజయ రామరావు
- పాలకుర్తి – రామ్మోహన్ రెడ్డి
- డోర్నకల్ (ఎస్టీ) – భూక్యా సంగీత
- మహబూబాబాద్ (ఎస్టీ) – హుస్సేన్ నాయక్
- వరంగల్ పశ్చిమ – రావు పద్మా
- వరంగల్ తూర్పు – ఎర్రబెల్లి ప్రదీప్ రావు
- వర్థనపేట(ఎస్సీ) – కొండేటి శ్రీధర్
- భూపాలప్లలి – చందుపట్ల కీర్తి రెడ్డి
- ఇల్లందు (ఎస్టీ) – రవీంద్ర నాయక్
- భద్రాచలం (ఎస్టీ) – కుంజ ధర్మారావు