ఈ ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని నికరాగ్వూ భామ గెలుపొందించింది. 72 మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ నికరాగ్వూ షెన్నిస్ పలాసియోస్ విజేతగా నిలిచింది. గతేడాది విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఆమెకు కిరీటాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆఖరి రౌండ్లో జీవితంలో ఎవరిని మార్గదర్శిగా ఎంచుకుంటారని న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు 18వ శతాబ్దపు బ్రిటిష్ తత్వవేత్త, స్త్రీవాది మేరీ వోల్స్టోన్క్రాఫ్ట్ అని సమాధానం ఇచ్చారు. ‘ఆమె సరిహద్దులను ఉల్లంఘించి చాలా మంది మహిళలకు అవకాశం ఇచ్చింది.. ఈ రోజు మహిళలకు ఎటువంటి పరిమితులు లేవు’ అని చెప్పారు.
మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న మొట్టమొదటి నికరాగ్వూ యువతిగా షేనిస్ రికార్డులకెక్కారు. ఇక, భారత్ తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న శ్వేతా శార్దా టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయారు. సెమీ-ఫైనల్స్లో ఆమె టాప్-20లో నిలిచారు.ఎల్ సాల్వెడార్ వేదికగా జరిగిన ఈ పోటీలు జరిగాయి. 2012 మిస్ యూనివర్స్ ఒలివియా కల్పో, మెనౌనోస్, జెన్నీ మై వరుసగా రెండోసారి టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చారు.
జ్యూరీ హాల్, 2018 మిస్ యూనివర్స్ క్యాథ్రినా గ్రే కరస్పాండెంట్ పాత్రను చేపట్టారు. ఇక, మిస్ యూనివర్స్ పోటీల్లో మొదటిసారి వివాహితతో పాటు పిల్లలున్న మహిళలకు అవకాశం కల్పించారు. 1957లో ఈ పోటీలు ప్రారంభమైన తర్వాత వివాహితలు పాల్గొనడం ఇదే తొలిసారి.
పాకిస్థాన్ మొదటిసారిగా ఈ పోటీలకు తమ దేశం తరఫున ప్రతినిధి పంపింది. అలాగే, డెన్మార్, ఈజిప్టు, గునియా, హంగేరి, ఐర్లాండ్, కజికిస్థాన్, లాత్వియా, మంగోలియా, నార్వే, జింబాబ్వే రీ-ఎంట్రీ ఇచ్చాయి. చివరిసారిగా 2001లో జింబాబ్వే, 2006లో లాత్వియా, 2017లో గుయానా, 2019లో ఈజిప్టు, మంగోలియాలు మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నాయి.