దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే టీమిండియా టీ20, వన్డే, టెస్టు జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించింది. మొదట జరగబోయే టీ20, వన్డే సిరీస్ ల నుంచి తమను మినహాయించాల్సిందిగా రోహిత్ శర్మ, కోహ్లి కోరినట్లు బోర్డు వెల్లడించింది. దీంతో వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా ఉండనున్నారు.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు రోహిత్, కోహ్లి తిరిగి రానున్నారు. ఇక పేస్ బౌలర్ మహ్మద్ షమి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని, అతడు పూర్తి ఫిట్ గా ఉంటే టెస్టులకు తిరిగి వస్తాడని బీసీసీఐ తెలిపింది.
దక్షిణాఫ్రికాతో డిసెంబర్, జనవరిలో జరగబోయే మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం ఢిల్లీలో గురువారం సమావేశమైన సెలక్షన్ కమిటీ మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. భారత వన్డే జట్టులోని తొలిసారి సాయి సుదర్శన్ కు చోటు దక్కింది. ఇక రజత్ పటీదార్, రింకు సింగ్, సంజూ శాంసన్ లాంటి వాళ్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు టీమ్ ఇదే
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకు సింగు, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, ముకేశ్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చహర్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు టీమ్ ఇదే
యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రుతురాజ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్, అర్ష్దీప్, సిరాజ్
టెస్టు జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్, జైస్వాల్,కోహ్లీ, శ్రేయస్, గైక్వాడ్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్లు), అశ్విన్, జడేజా, శార్దూల్, సిరాజ్, షమీ, బుమ్రా(వైస్ కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ