కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించేందకు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. గురువారం జలసౌధలో బోర్డు చైర్మన్ శివ్నందన్ కుమార్ అధ్యక్షతన జరిగిన కృష్ణాబోర్డు సమవేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి నీటిసారుదల శాఖ ఈఎన్సీ మురళీ ధ ర్ , ఎపి నుంచి ఇఎన్సి నారాయణరెడ్డి పాల్గొన్నా రు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును బోర్డుకు అప్పగించేందుకు ఇఎన్సి మురళీధర్ అంగీకారం తెలపగా, ఎపి పర్యవేక్షణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టును కూడా బోర్డుకు అప్పగించేందుకు ఆ రాష్ట్ర ఇఎన్సి నారాయణరెడ్డి సుముఖత తెలిపారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల అప్పగింతపై రెండేళ్లకు పైగా కొనసాగుతూ వస్తున్న చిక్కుముడులు వీడిపోయాయి.
తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న తొమ్మది ఔట్లెట్లను బోర్డుకు అప్పగించేందకు అంగీకరించగా, ఎపి కూడా తన పరిధిలో ఉన్న ఆరు ఔట్లెట్లను అప్పగిస్తున్నట్టు వెల్లడించింది.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేదాకా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు తెలుగు రాష్ట్రాలకు కృష్ణానదీ జలాలను పంపిణీ చేయటం,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తాగునీటికి, సాగు నీటికి అవసరాల మేరకు నీటిని విడుదల చేయటం, వినియోగించుకుంటున్న నీటిని లెక్కించటం, వర్షాకాలం వరదల సందర్భంగా కృ ష్ణానదీ నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్లే వరద జలాలను రెండు రాష్ట్రాలకు తగిన నిష్పత్తిలో కేటాయింపులు చేసి వినియోగించుకునేలా చూడటం తదితర అంశాలన్నింటినీ పర్యవేక్షిస్తు, అవసరాలకు తగ్గట్టుగా చర్చించి నిర్ణయాలు తీసుకునే బాధ్యతను త్రిసభ్యకమిటీకి అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.
త్రిసభ్య కమిటీ బోర్డు సభ్య కార్యదర్శి కన్వీనర్గా, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రక్షణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సిఆర్పిఎఫ్ బలగాలకు అప్పగించేందుకు నిర్ణయించారు. కేంద్ర బలగాలు ఇక నుంచి బోర్డు కనుసన్నల్లో విధులు నిర్వహించనున్నాయి.
బోర్డు నిర్వహణకోసం అవసరమైన నిధులు అందజేసేందుకు రెండు రా్రష్ట్రాలు అంగీకరించాయి. అంతే కాకుండా బోర్డు పరిధిలోనికి చేరనున్న ప్రాజెక్టుల నిర్వహణను పర్యవేక్షించేందుకు అవసరమైన సిబ్బందిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సమకూర్చేందుక కూడా ఆమోదం లభించింది.
శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని వేసవి అవసరాల కోసం వినియోగించుకునేందుకు కూడా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఉన్న నీటిలో నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాలువకు రెండు టీఎంసీలు, కుడి కాలువకు మూడు టీఎంసీలు అవసరాలకు తగ్గట్టుగా విడుదల చేసేందకు సమావేశంలో అంగీకారం కుదిరింది.
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ కృష్ణా ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కృష్ణాబోర్డకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే, పవర్ స్టేషన్స్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కృష్ణానదీ జలాలకు సంబంధించి తమ రాష్ట్ర డిమాండ్స్ అన్ని కేంద్రానికి లేఖలు రాసామని, ఇం కా అక్కడ నుంచి నిర్ణయం రాలేదని తెలిపారు.
ఏపి నీటిపారుద ల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బోర్డు పరిధిలో మొత్తం 15 ఓటిస్లలో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్వి ఉన్నాయని తెలిపారు. కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి 2 టీఎంసీలు, రైట్కెనాల్ నుంచి 3 టీఎంసీ లు ఏపికి విడుదలకు ఒప్పుకున్నట్టు తెలిపారు. ఏప్రిల్లో 5 టీఎంసీలకు ఏపికి ముందుగానే కేటాయింపు ఉందన్నారు. ప్రాజెక్టుల ఆపరేషనల్ కోసం తెలంగాణ ఒప్పుకుందని నారాయణరెడ్డి పేర్కొన్నారు.