కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అదిరే శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. డియర్నెస్ అలెవ్సన్, డియర్నెస్ రిలీఫ్ 4 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం సమావేశమైన కేంద్ర కేబినేట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.
7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగులుక డీఏ 4 శాతం పెంచుతూ 50 శాతానికి చేర్చినట్లు వెల్లడించారు. పెంచిన డీఈ 4 శాతం జనవరి1 , 2024 నుంచే అమలులోకి వస్తుందని తెలిపింది. వచ్చే నెల శాలరీలో ఎరియర్స్ కలిపి చెల్లించనుంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
వచ్చే నెల నుంచి జీతాలు, పెన్షన్ భారీగా పెరగనున్నాయి. మరోవైపు.. డీఏ పెంపుతో పాటు గ్యాట్యూటీ, ఇతర అలెవన్సులు సైతం పెంచుతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై కేంద్ర మంత్రి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, కేబినెట్ నిర్ణయీలు పూర్తి స్థాయిలో బయటకు వస్తే స్పష్టత రానుంది. ఏదేమైనా సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ఉద్యోగులకు అదిరే శుభవార్త అందించిందని చెప్పవచ్చు.
మరోవైపు.. కేబినెట్ కీలక నిర్ణయాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్ ఉజ్వల యోజన ద్వారా అందిస్తున్న రూ.300 సబ్సిడీ పథకాన్ని 2025, మార్చి 31 వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా కేంద్రంపై అదనంగా మరో రూ.12 వేల కోట్లు భారం పడుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మరోవైపు.. 2024-25 సీజన్ కి సంబంధించి జూట్ కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు తెలిపారు. క్విటాలుకు రూ.285 పెంచినట్లు తెలిపారు. దీంతో క్విటాలు జూట్ ధర రూ. 5,335కు చేరింది.