బిజెపి 111 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఐదవ జాబితాలో కొందరు కేంద్ర మంత్రులు, సిట్టింగ్ ఎంపీలకు చోటు దక్కలేదు. కేంద్రమంత్రులు అశ్వినీ కుమార్ చౌబే, వీకే సింగ్కు టికెట్లు నిరాకరించింది. అలాగే పార్టీ సీనియర్ నేత వరుణ్ గాంధీ సహా 37 మంది సిట్టింగ్ ఎంపీలను బీజేపీ అధిష్ఠానం పక్కనపెట్టింది.
జాబితాలో ఇటీవల ప్రతిపక్ష పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలకు టికెట్లు లభించాయి. ఇటీవల కర్ణాటకకు చెందిన ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఆయన ఇప్పటి వరకు ఆరు సార్లు పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల ఆయన రాజ్యాంగం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అగ్రనాయకత్వం ఆయనకు టికెట్ను నిరాకరించినట్లు తెలుస్తున్నది.
ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా తొమ్మిది మందికి బీజేపీ టికెట్ నిరాకరించింది. గుజరాత్లో ఐదుగురు, ఒడిశాలో నలుగురు, బిహార్, కర్ణాటక, జార్ఖండ్లో ముగ్గురు చొప్పున మొత్తంగా 37 మంది ఎంపీలకు టికెట్లు ఇవ్వలేదు. ఇటీవల బీజేపీలో చేరిన సీతాసోరెన్, తపస్ రాయ్, ఎన్ కిరణ్కుమార్రెడ్డి సహా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలను పోటీలో బరిలోకి దింపింది.
కాంగ్రెస్కు నేతలు నవీన్ జిందాల్, జితిన్ ప్రసాదకు కురుక్షేత్ర, ఫిలిబిత్ పార్లమెంట్ స్థానాలను కేటాయించింది. ఫిలిబిత్ ఎంపీగా కొనసాగుతున్న వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన తల్లి మేనకా గాంధీ మరోసారి సుల్తాన్పూర్ నుంచి బరిలో ఉండనున్నారు.
ఘజియాబాద్లో రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన కేంద్రమంత్రి వీకే సింగ్కు టికెట్ నిరాకరించిన బీజేపీ అధిష్ఠానం.. ఆయన స్థానంలో అతుల్ గార్గ్కి టికెట్ ఇచ్చింది. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్గా పేరొందిన నటి కంగనా రనౌత్ హిమాచల్ప్రదేశ్లోని మండి నియోజకవర్గం టికెట్ కేటాయించింది.
రామాయణం టీవీ సీరియల్లో నటించిన అరుణ్ గోవిల్కు మీరట్ టికెట్ ఇచ్చింది. జార్ఖండ్లోని దుమ్కా నుంచి జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్ణు బీజేపీ పోటీలో నిలిపింది. ఆమె ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ బెల్గాం నుంచి, కోల్కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ బెంగాల్లోని తామ్లుక్ నుంచి పోటీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక మేదినీపూర్ ఎంపీ దిలీప్ ఘోష్ బర్ధమాన్-దుర్గాపూర్ స్థానానికి మార్చింది.