ఛత్తీస్గఢ్- తెలంగాణ సరిహద్దులో శుక్రవారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోలు మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో మూడు తుపాకులు సహా ఇతర సామాగ్రిని గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నాయి.
పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అడవుల్లో ఉన్నారన్న పక్కా సమాచారం తెలుసుకుని ప్రత్యేక పోలీసు బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ క్రమంలో అప్రమత్తమైన మావోయిస్టులు పోలీసులపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల ముగ్గురు మావోలు మరణించారు.
ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రిగుట్టలు- ఛత్తీస్గఢ్ పూజారి కాంకేర్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని పోలీసులతోపాటు సరిహాద్దు ప్రాంతాల్లోని సిబ్బందిని కూడా అధికారులు అప్రమత్తం చేశారు.
ముగ్గురు మావోలు మృత్యువాత చెందిన నేపథ్యంలో వారు మళ్లీ ఏదైనా ఎటాక్ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికలకు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల వేళ మావోలు ఏదైనా మళ్లీ ప్లాన్ చేసి రివేంజ్ తీర్చుకుంటే ఎలా అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.