తాను అగ్నిపర్వతంలా ఉన్నానని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ నేపథ్యంలో శాసనభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
మండలిలో బీఆర్ఎస్ పక్షనేతగా మధుసూదనాచారిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే తన కుమార్తెను జైలులోపెట్టారట్టాని ఆరోపించారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అంటూ ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితులు ఏమీ లేని.. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణను సాధించామని స్పష్టం చేశారు.
నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే బాగా ఎదుగుతారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయిందని.. పాలనపై దృష్టి పెట్టకుండా అభాసుపాలు చేసే పనిలోనే ఉన్నారని విమర్శించారు. శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పుతున్నాయని నిలదీశారు.
ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారని.. పార్టీ వదిలి వెళ్లేవారిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అన్నట్టు సమాచారం.