పెట్రోల్, డీజిల్ధరలు రోజురోజుకు పెరగుతున్నాయి. గత 12 రోజుల్లో పదిసార్లు ధరలను పెంచారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ రోడ్సెస్లను వసూలు చేస్తోంది. దీంతో పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ 121.31కి చేరుకోగా డీజిల్ రూ 106.84 అయ్యింది. వారం క్రితం పెట్రోలు రూ.112వ మాత్రమే ఉంది. గత ఏడాది ఏప్రిల్లో పెట్రోల్ ధర లీటర్కు 87.71 ఉంది. ఏడాది కాలంలో ఏకంగా రూ.34 పెరిగింది.
డీజిల్ ధర ఏడాది క్రితం రూ 80.66 వుంటే ఇప్పుడు రూ 106.84కు చేరింది. అంటే ఒక్క ఏడాదిలో రూ 25.77 పెరిగింది. సరఫరాలో ఉన్న దూరాన్ని బట్టి రాష్ట్రంలో జిల్లాల వారీగానూ ధరల్లో మార్పులున్నాయి. చిత్తూరులో లీటర్ పెట్రోల్ రూ 121.31 అయితే నెల్లూరులో రూ 120.89, విజయవాడలో రూ 120.66 ఉంది. డీజిల్ చిత్తూరులో రూ106.84 వుంటే విజయవాడలో రూ 105.66కు చేరింది.
కర్నాటకలో పెట్రోలు లీటరు రూ.112, తమిళనాడులో రూ.111, ఒడిస్సాలో రూ.114, తెలంగాణాలో రూ.119 ఉంది. డీజిల్ ధర కర్నాటకలో రూ.95.62, తమిళనాడులో రూ.101, ఒడిస్సాలో రూ.103, తెలంగాణాలో రూ.105 ఉంది. దీనిపై వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.