ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జరుపనున్న జమ్మూ కాశ్మీర్ పర్యటనపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370, రాష్ట్ర హోదాలను రద్దుచేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఆయన ఈ ప్రాంతంలో మొదటిసారిగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి కీలక ప్రకటన చేస్తారా? అని చాలామంది ఎదురు చూస్తున్నారు.
2019లో తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, మోదీ తగిన సమయంలో ఎన్నికలు జరపడంతో పాటు జమ్మూ, కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. జూన్ 2018లో బిజెపి-పిడిపి సంకీర్ణం పతనమైనప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలనలో ఉంది. సాంబాలోని పల్లిలో జాతీయ పంచాయతీరాజ్ సదస్సు సందర్భంగా మోదీ జమ్మూకు వస్తున్నారు.
మూడంచెల పంచాయతీ రాజ్ సంస్థలలోని 280 జిల్లా అభివృద్ధి మండలి (డిసిసి) సభ్యులు, 280 మంది బిగిసి చైర్మన్లు, 4,190 మంది సర్పంచ్లతో సహా 33,000 మందిని పైగా ఈ సదస్సుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని అనేక హైడల్ పవర్ ప్రాజెక్టులు, ఐదు ఎక్స్ప్రెస్వేలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. దేశంలో రెండవ పొడవైన రైల్వే సొరంగం అయిన 11.5 కి.మీ బనిహాల్-ఖాజీగుండ్ సొరంగాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.
రూ 38,082 కోట్ల విలువైన పారిశ్రామిక అభివృద్ధి ప్రతిపాదనలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కాశ్మీరీ పండిట్లతో సహా పలు ప్రతినిధి బృందాలను ఆయన కలుస్తారు. పల్లి సదస్సుకు 80 వేల నుంచి లక్ష మంది హాజరవుతారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 700 పంచాయతీల ప్రతినిధులను, కొంతమంది రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
ఆర్టికల్ 370 తరలింపు తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్-డిలిమిటేషన్ కసరత్తును పూర్తి చేసిన తర్వాత మోదీ జమ్మూ కాశ్మీర్ను సందర్శిస్తున్నారు. కమిషన్ జమ్మూ ప్రాంతంలో ఆరు అసెంబ్లీ స్థానాలను పెంచింది. కాశ్మీర్లో ఒకటి మాత్రమే పెంచింది. జమ్మూ కంటే ఎక్కువ జనాభా కాశ్మీర్ లో ఉన్నప్పటికీ, జమ్మూ ప్రాంతంలో ఇప్పుడు 43 అసెంబ్లీ స్థానాలు, కాశ్మీర్లో 47 ఉన్నాయి. ఇంతకుముందు, జమ్మూలో 37, కాశ్మీర్ 46లో , లడఖ్లో నాలుగు ఉన్నాయి.
జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణను ఎన్నికల తర్వాత జరిగే డీలిమిటేషన్తో బీజేపీ ముడిపెట్టింది. దానితో ఈ పర్యటన సందర్భంగా ప్రధాని ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పలు ప్రాంతీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది జూన్లో కాశ్మీర్పై మోదీ అఖిలపక్ష సమావేశం జరిపినప్పటి నుండి నుండి, కేంద్రం ప్రాంతీయ పార్టీలతో ఎటువంటి సంప్రదింపులు జరప లేదు.
రాబోయే ఎన్నికల కోసం తమ మద్దతుదారులను ఉత్సాహపరిచేందుకు బీజేపీ చేస్తున్న రాజకీయ ప్రచారానికి మోదీ పర్యటన నాంది అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్న జమ్మూలో, ముఖ్యంగా జమ్మూ, ఉధంపూర్, కథువా, సాంబా జిల్లాలు, రియాసిలోని కొన్ని ప్రాంతాలతో కూడిన డోగ్రా హార్ట్ల్యాండ్లో మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు భావిస్తున్నారు.
అయితే, ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ వలె జమ్మూలో పార్టీకి ప్రజాదరణ పొందిన స్థానిక నాయకుడు లేకపోవడంతో బిజెపి ఎక్కువగా ప్రధాని మోదీ ప్రజాకర్షణపై ఆధారపడవలసి వస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లను ‘మోదీ వేవ్’ వల్లే గెలుచుకో గలిగింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూలోని బిజెపి మద్దతుదారులు సంబరాలు చేసుకున్నా ఇప్పుడు బయటి వ్యక్తులు ఉద్యోగాలు, వ్యాపారాలకు వస్తుండడంతో స్థానిక ప్రజలలో పెరుగుతున్న అభద్రతాభావం ప్రజలలో తమపట్ల ఆగ్రహంకు దారితీయవచ్చని బిజెపి నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆర్టికల్ 370ని పఠించిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి తాము తీసుకున్న చర్యలు మద్దతును కోడదీసుకోగలవాని ఆశిస్తున్నారు.
ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా నివసించే ప్రజలకు ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు, రూ. 4,000 నెలవారీ ఆర్థిక సహాయంతో 25,000 గ్రామ రక్షణ బృందాల పునరుద్ధరణ, ఈ ప్రాంతంలో మెరుగైన భద్రతా పరిస్థితి వంటి చర్యలు పార్టీకి సానుకూలతను తెగలవని విశ్వసిస్తున్నారు.
కరోనా కారణంగా రెండేళ్లుగా ఆగిపోయిన వార్షిక అమర్నాథ్ యాత్రకు ఈ ఏడాది అనూహ్య స్పందన లభించగలదని, రికార్డు స్థాయిలో 6-8 లక్షల మంది యాత్రికులు పాల్గొంటే ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యక్రమాలు మెరుగుపడి స్థానికులు లాభపడగలరని అంచనా వేస్తున్నారు.