కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేపాల్ లోన్ ఓ పబ్లో ఉన్న, ఓ చైనా మహిళతో కలసి సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ గా మారింది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ నైట్ క్లబ్ లో రాహుల్ కనిపించారు. ఈ వీడియోని పలువురు బీజేపీ నేతలు ట్విట్టర్ లో షేర్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్లో మతఘర్షణలు జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎంచక్కా పార్టీ చేసుకుంటున్నారని విమర్శలు సంధించారు. కష్టాల్లో ఉన్న పార్టీని వదిలి విదేశాల్లో పార్టీ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాగా నేపాల్లోని చైనా రాయబారిగా పనిచేస్తున్న మహిళాతో కలిసి పార్టీ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ నేపాల్లో ఉన్నట్టు ఖాట్మండు పోస్ట్ కథనం కూడా నిర్ధారించింది. ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆయన నేపాల్ వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ ఐటీ కన్వినర్ అమిత్ మాలవీయ స్పందిస్తూ… కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమవుతున్న వేళ రాహుల్ గాంధీ పార్టీలో మునిగిపోయారని విమర్శించారు. ఆయన చాలా స్థిరంగా ఉన్నారని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.
కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరెణ్ రిజుజ్ స్పందిస్తూ.. సెలవులు, పార్టీలు, విహారయాత్రలు, ప్రైవేటు విదేశీ యాత్రలు వంటివి దేశానికి కొత్తమీ కాదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో గాంధీ కుటుంబ వారసుడి ప్రవర్తన ఇదేనా అని ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు.
ఖాట్మండ్ పోస్ట్ కథనం ప్రకారం.. రాహుల్ గాంధీ నేపాల్లో ఉన్నారు. సోమవారం సాయంత్రం 4:40 నిమిషాలకు విస్తారా విమానంలో ఖాట్మండ్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద ముగ్గురు వ్యక్తులు రాహుల్ గాంధీని కలిశారు.
రాహుల్ గాంధీతోపాటు ఆయన స్నేహితులు ఖాట్మండ్ మారియెట్ హోటల్లో దిగారు. తన నేపాలి ఫ్రెండ్ సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ నేపాల్ వచ్చారని పేర్కొంది. అయితే వైరల్గా మారిన వీడియోకు సంబంధించిన సమాచారమేమీ పేర్కొనలేదు.
ఈ వివాహ వేడుక తరుణంలోనే ఆయన నైట్ పార్టీకి హాజరై ఉండొచ్చని అంచనా. ఇక ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ దేశాల పర్యటనను లక్ష్యంగా చేసుకుని.. కాంగ్రెస్ ‘దేశంలో తీవ్ర సంక్షోభంలో ఉంటే.. సారు విదేశాల్లో ఉండడమే ఇష్టపడుతున్నారు’’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ తరుణంలో రాహుల్ నేపాల్ టూర్పై ఇప్పుడు బీజేపీ విమర్శలకు ఆయుధంగా చేసుకుంది.
దుమారం రేపుతున్న వీడియోలో.. రాహుల్ గాంధీ ఓ మహిళతో క్లోజ్గా మరింత చర్చనీయాంశంగా మారింది. ఆమె నేపాల్లో చైనా దౌత్యవేత్త అయిన హౌ యాంకీ అని, గతంలో నేపాల్ ప్రధానిపైనా హనీ ట్రాప్ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో సదరు వీడియోపై మరింత స్పష్టత, కాంగ్రెస్ నుంచి వివరణ రావాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ను ముంచుతూ.. యువరాజు విలాసాల్లో తేలుతున్నాడంటూ పలువురు సెటైర్లు సైతం పేలుస్తున్నారు.