మూడు ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్లో ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్తో భేటీ కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటన ముగిసింది. భారత కాల మానం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి వీళ్ల భేటీ జరిగింది.
ఈ సందర్భంగా మాక్రోన్తో భేటీని ఇద్దరు మిత్రుల కలయికగా ప్రదాయి మోదీ అభివర్ణించారు. బుధవారం సాయంత్రం ఫ్రాన్స్లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ ప్యారిస్లోని అధ్యక్ష అధికార భవనం ఎల్వైసీ ప్యాలెస్కి చేరుకున్నారు. అక్కడ వీళ్లద్దిరి భేటీ జరిగింది.
ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు. అలాగే మంగళవారం మాక్రోన్, పుతిన్ మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ పరిణామాలపై ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ మధ్య ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేక్రాన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో మోదీ ఆయనను అభినందించారు. ‘నమస్తే ప్యారిస్’ అంటూ తన ఫ్రాన్స్ పర్యటన ప్రారంభమైందని ట్వీట్ చేసిన మోదీ.. ఫ్రాన్స్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.
ఇక ప్రధాని మోదీ సైతం ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండబోరని, పైగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల పర్యటన ముగియడంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారత్కు తిరుగుప్రయాణం అయ్యారు.