మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయిను విశాఖ పోలీసులు అడ్డగించారు. రుషికొండ హరిత రిసార్ట్స్ను పర్యటించేందుకు జిల్లా నాయకులతో కలిసి వెళ్తుండగా.. గీతం కాలేజీ వద్ద ఆయన కాన్వాయిను పోలీసులు అడ్డుకున్నారు.
చంద్రబాబు, విశాఖ పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రుషికొండపై టూరిజం రిసార్ట్స్ ఎంతో అందంగా ఉండేవని, వైసిపి ప్రభుత్వం వాటిని ధ్వంసం చేసి కొత్తగా నిర్మాణాల పేరుతో నాటకాలాడుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు.
టూరిజం రిసార్ట్స్ పేరుతో ఇక్కడ పర్యావరణం అంతా నాశనమైందని, దాన్ని చూసేందుకు వచ్చిన తనను రోడ్డుపైనే అడ్డుకోవడం దారుణమని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని, ఇందులో మింగిందంతా కక్కిస్తానని చంద్రబాబు చెబుతూ వెనుదిరిగారు. సాగర్నగర్కు చెందిన బోడేపూడి దొరబాబును పోలీసులు అరెస్ట్ చేసి ఆటోలో తరలించారు.
ఎన్సిసికి గతంలో కేటాయింపులు జరిపిన 90 ఎకరాల భూమి ఇటీవల వివాదాస్పదంగా పత్రికల్లో చర్చకు రావడంతో ఆ ప్రాంత పర్యటనకు చంద్రబాబు తొలుత ప్లాన్ చేశారు.
రుషికొండ మీదుగా ఎన్సిసి భూముల ప్రదేశానికి వెళ్తుండగా తెలుగుదేశం నాయకులు ఎన్సిసి కంటే రుషికొండపై వైసిపి పాలనలో విధ్వంసం జరిగిందని, గతంలో రిసార్ట్స్ను కూలదోసి కొత్తగా కట్టేందుకు ప్లాన్ చేశారని, పర్యావరణం పాడైందని చంద్రబాబుకు చెప్పగానే తన కాన్వారు ఒక్కసారిగా రూటు మారింది. దీంతో పోలీసులు అడ్డగించారు. ఇక్కడకు అనుమతుల్లేవంటూ రోడ్డుపైనే చంద్రబాబును కాసేపు నిలబెట్టేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరుకున్నాయని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విశాఖ జిల్లా, భీమునిపట్నం మండలం, రాజుల తాళ్ళ వలస గ్రామంలో గురువారం రాత్రి ”బాదుడే బాదుడు” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రచ్చ బండలోని ఆయన పాల్గని ప్రసంగించారు.
ఆడపడుచులపై హత్యా చారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నయని ఆందోళన వ్యక్తం జేశారు. మరో వైపు రాష్ట్రంలోడ్రగ్స్ మాఫియా తయారైందని ఆరోపించారు.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజా వేదిక నుంచి మొదలుపెట్టి నేటి రుషికొండ వరకూ విధ్వంసం సాగిందని నిప్పులు చెరిగారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మి ఓట్లేసిన ప్రజలు, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన చూసి బాధ పడుతున్నారని పేర్కొన్నారు