దేశోధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు దాతృత్వం త్యాగం దేశ భక్తి నేటితరానికి ఆదర్శమని కృష్ణా జిల్లా ఉపకులపతి ఆచార్యా కె.బి చంద్రశేఖర్ తెలిపారు. పామర్రు మండలం ఎలకుర్రు గ్రామం లో శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ని ప్రముఖులకు విశ్వదాత అవార్డులను ఆయన అందచేసారు.
విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం లో స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ప్రముఖ విశ్లేషకులు గ్రంధాలయ ఉద్యమకారులు డాక్టర్ నాగులపల్లి భాస్కర రావు, ప్రముఖ రచయిత్రి తేళ్ళ అరుణ, ఓఎస్డి ఎన్ ఎస్ కే ఖాజావలి, ప్రముఖ జర్నలిస్ట్ విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు, రాజమండ్రి ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు పసుమర్తి శ్రీనివాస శర్మ లకు అవార్డులను అందజేశారు.
ఈ సభలో ఉపకులపతి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో గాంధీజీ అడుగుజాడల్లో నాగేశ్వరరావు పంతులు తాను నడుస్తూ పలువురిని నడిపించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి కే మోహన్ కుమార్ మాట్లాడుతూ నాగేశ్వరరావు పంతులు మద్రాసులోని నివాసంలో జరిగిన శ్రీబాగ్ ఒడంబడిక ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దోహదపడిందని పేర్కొన్నారు.
రచయిత డాక్టర్ జివి పూర్ణచంద్ మాట్లాడుతూ నాగేశ్వరరావు పంతులు గ్రంథాలయ ఉద్యమం ద్వారా పుస్తక పఠనంపై తెలుగు వారిని నడిపించగలిగారని కొనియాడారు . ఎలకుర్తి కొన్ని గ్రామాలలో నాగేశ్వరరావు పంతులు అందించిన సేవలు పరువాలేమని తెలిపారు. ఆయన వంశీకులు నాగేశ్వరరావు ఏలూరు గ్రామంలో బడుగు బలహీన వర్గాల వారికి సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ అవార్డు గ్రహీతలు సాధించిన విజయాలను వివరించారు.