ఎనిమిదేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ, ఇప్పుడేం జరిగింది అంటూ తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు ప్రశ్నలు కురిపించారు. వీలు చిక్కినప్పుడల్లా ఈ మధ్య ప్రధానిని లక్ష్యంగా చేసుకొని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 8 ఏళ్ల పాలనపై వీలైనప్పుడు ట్విట్టర్లో విమర్శలతో పాటు ప్రశ్నలు సందిస్తున్నారు.
ప్రధాని మోదీ 8 ఏళ్ల క్రితం భారత్ గెలిచింది..ఇది దేశం సాధించిన విజయం అచ్చేదిన్ వస్తున్నాయని ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ప్రశ్నలు సందించారు. అచ్చేదిన్ హామీ ఇచ్చి 8ఏళ్లు పూర్తయిందన్న కేటీఆర్..అచ్చేదిన్ ఇవేనా అంటూ ప్రశ్నించారు.
మోదీ ఎనిమిదేళ్ల పాలనలో రూపాయి కనిష్ట స్థాయికి రూ 77.80 చేరిందని పేర్కొన్నారు. 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం ఉందని తెలిపారు. 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదయ్యిందని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎల్పిజి ధర పెరిగిందని తెలిపారు.
42 ఏళ్లలో అత్యంత దారుణ స్థితికి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని అంటూ కేటీఆర్ విమర్శించారు. మీరు చాలా బాగా చేశారు సర్ అంటూ మోదీపై ఆయన సెటైర్లు వేశారు. అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు కూడా 27 ప్రశ్నలత ోకేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.