దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్ఐసీ షేర్లు ఐపీఓ షేర్లు స్టాక్మార్కెట్లలో నేడు లిస్ట్ కాగా, ఎన్నో ఆశలతో పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వచ్చిన ముదుపరులు ఖంగుతిన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎల్ఐసీ షేర్లు స్టాక్ మార్కెట్ లో భారీ డిస్కౌంట్ తో లిస్ట్ అయ్యాయి.
8.62 శాతం డిస్కౌంట్తో రూ.867 దగ్గర లిస్ట్ కావడంతో ఎల్ఐసీ షేర్లు లక్షలాది మంది మదుపర్లకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ లెక్కన కనీసం 15 షేర్లున్న ఒక లాట్ కు రూ 14, 235 పెట్టుబడిగా పెట్టిన ముదుపరులకు రూ 1,155 నష్టం తప్పలేదు. ఎల్ఐసీ షేర్లు ప్రీమియంతో లిస్ట్ అవుతాయని అంతా అంచనా వేశారు.
కానీ అంతర్జాతీయ పరిస్థితులు,అమెరికా, భారత్ లలో వడ్డీ రేట్ల పెంపుతో మార్కెట్లు వరుసగా డౌన్ అవుతున్నాయి. ఈ ప్రభావం ఎల్ఐసీపై కూడా పడడంతో ప్రీమియం తగ్గిపోవడమే కాకుండా షేర్లు నెగిటివ్ లో లిస్ట్ అయ్యాయి.
ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో మునిగిపోయిన సమయంలో ఎల్ఐసీ లిస్ట్ కావడంతో ప్రతికూల ప్రభావం పడింది. సుమారు మూడు రెట్లు ఓవర్సబ్స్క్రైబ్ అయిన ఐపీఓ తర్వాత ఎల్ఐసీ షేర్లు షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి. ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు ఒక షేరుపై రూ.60 డిస్కౌంట్ వచ్చినా నష్టం మాత్రం తప్పలేదు. అయితే దీర్ఘకాలంలో ఎల్ఐసీ లాభాలిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇష్యూ పరిమాణం కంటే దాదాపు మూడు రెట్లు ఓవర్సబ్స్క్రైబ్ అయిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) తర్వాత ఎల్ఐసి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ కావడం గమనార్హం. ప్రభుత్వం ఎల్ఐసీ షేర్లు షేర్ల ఇష్యూ ధరను ఒక్కొక్కటి రూ 949 గా నిర్ణయించింది.
కానీ.. 8.62 శాతం డిస్కౌంట్తో రూ.867 దగ్గర ఎల్ఐసీ షేర్లు లిస్ట్ కావడంతో ఈ దిగ్గజ బీమా కంపెనీపై ఎంతో నమ్మకంతో బిడ్లు దాఖలు చేసిన చిన్న స్థాయి ముదుపరులకు నిరాశ తప్పలేదు. ఐపీఓలో భాగంగా కంపెనీ 16,20,78,067 షేర్లను అమ్మకానికి పెట్టగా, ఇష్యూ రెండో రోజైన గత గురువారం నాటికి 1.03 రెట్లకు సమానమైన (16,68,60,765) షేర్ల కొనుగోలుకు బిడ్లు లభించాయని స్టాక్ ఎక్స్ఛేంజీలు వెల్లడించాయి.
ఎల్ఐసీ ఇష్యూకు పాలసీదారుల నుంచి భారీ స్పందన లభించింది. వారికి కేటాయించిన షేర్లకు ఇప్పటికే మూడు రెట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. కంపెనీ ఉద్యోగులకు రిజర్వ్ చేసిన షేర్లకు సైతం 2.21 రెట్ల సబ్స్ర్కిప్షన్ లభించింది.
ఇష్యూలో రిటైల్ మదుపర్లకు 6.9 కోట్ల షేర్లను కేటాయించగా.. అందులో 93 శాతం షేర్ల కొనుగోలుకు బిడ్లు లభించాయి. ఇంతా జరిగితే.. ఎల్ఐసీ షేర్లు ఆఫర్ ధరతో పోల్చితే 8.11 శాతం నష్టంతో లిస్ట్ కావడం మదుపర్లు ఊహించని పరిణామం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లో ఎల్ఐసీ షేర్లు రూ.872 వద్ద, బాంబే స్టాక్ ఎక్సేంజ్లో రూ.867.20 వద్ద నమోదు కావడం గమనార్హం. ఇది ఇనీషియల్ ఇష్యూ ధర కంటే చాలా తక్కువ.
ఎల్ఐసీ ఐపీఓ కోసం ఆశగా ఎదురుచూసిన మదుపరులు ఎల్ఐసీ స్టాక్ రూ.900 నుంచి రూ.949 మధ్యలో అయినా లిస్ట్ అయ్యే అవకాశం ఉందన్న అంచనాల్లో ఉండగా రూ.867 వద్ద షేర్లు లిస్ట్ కావడంతో కంగుతిన్నారు. రూపాయి విలువ జీవనకాల గరిష్టానికి పడిపోయినప్పటికీ వినియోగదారులు దేశీయ వినియోగదారులు ఎల్ఐసి ఐపిఒపై దృష్టి సారించడంతో మంగళవారం రెండోసెషన్లోనూ దేశీయ షేర్లు కొంత మేర లాభపడ్డాయి.