చైనా తైవాన్ను బలవంతంగా ఆక్రమించాలని చూస్తే తాము (అమెరికా) సైనికపరంగా చైనాను అడ్డుకుంటుదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. తైవాన్ను ఆక్రమించే న్యాయపరమైన హక్కు చైనాకు లేదని బైడెన్ స్పష్టం చేశారు. అయితే వన్ చైనా పాలసీని తాము అంగీకరిస్తామని, ఆ ఒప్పందంపై సంతకం కూడా చేశామని ఆయన చెప్పారు.
క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి సోమవారం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్న బైడెన్ ఓ సమావేశంలో పాల్గొంటూ తైవాన్ విషయంలో చైనా ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉక్రెయిన్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని హితవు పలికారు.
కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒకవేళ తైవాన్ను చైనా ఆక్రమించుకోవాలని చూస్తే ‘ప్రమాదంతో ఆటలాడుకున్నట్టే’ అంటూ బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లో జరుగుతున్న అకృత్యాలకు పుతిన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
రష్యా సుదీర్ఘకాలం ఆ మూల్యాన్ని చెల్లించుకుంటుందని పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్లో రష్యా దాడులు చేస్తున్న సమయంలో చైనాకు పుతిన్కు ప్రత్యక్షంగా మద్దతు చేయడం గమనార్హం. రష్యాకు ఆర్థికంగా, ఆయుధాలను కూడా అందించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.
బిడెన్ హెచ్చరికపై చైనా మండిపాటు
అయితే, ప్రమాదంతో పోరాడుతున్నారన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. తైవాన్ విషయంలో తమ జాతీయ ప్రయోజనాలను రక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా తేల్చి చెప్పింది. చైనా స్వయం పాలిత తైవాన్ను నియంత్రిచేందుకు యత్నించలేదని, అయితే తైవాన్ను తమ భూభాగంలో భాగంగా భావిస్తోందని పేర్కొంది.
జాతీయ ప్రయోజనాలు, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో చైనాను ఎవరూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనిౖ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పష్టం చేశారు. తైవాన్ చైనా భూభాగంలో విడదీయరాని భాగంగా కలిసి ఉందని ఆయన వెల్లడించాయిరు. చైనా జాతీయ భద్రతను 140 కోట్ల ప్రజల ధృడ చిత్తంతో కాపాడుకుంటుందని అంటూ పరోక్షంగా హెచ్చరించారు.