కరోనా విజృంభణ సమయంలో తల్లిదండ్రులను కోల్పొయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రయోజనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 30న వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా విడుదల చేయనున్నారు.
ఇందులో భాగంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన పాస్బుక్తోపాటు ఆయుష్మాన్ భారత్ హెల్త్కార్డ్ను కూడా ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
దేశంలో కరోనా విజృంభణ మొదలైన 11 మార్చి 2020 నుంచి 28 ఫిబ్రవరి 2022 మధ్యకాలంలో ప్రాణాలు కోల్పొయిన బాధిత పిల్లలను ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని 29 మే 2021న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సమగ్ర రక్షణలో భాగంగా బాధిత పిల్లలకు వసతి కల్పించడం, విద్యా, స్కాలర్షిప్స్ అందించి వారికి మద్దతుగా నిలుస్తున్నారు.
ఉన్నత చదువుల్లోనూ సహాయం చేయడంతో పాటుగా 23 ఏళ్ల వయసు వచ్చేనాటికి ఆర్థికంగా స్వయం సమఅద్ధి చెందేలా రూ. 10 లక్షల సహాయం అందించనున్నారు. దీంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడం వంటి ప్రయోజనాలను ఈ పథకం ద్వారా అందించనున్నారు.
ఇందులో నమోదు కోసం పీఎంకేర్స్ఫర్చిల్డ్రన్.ఇన్ పేరుతో ప్రత్యేక పోర్టల్ను కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో ఆమోదం తెలిపిన వారికి ఈ పథకం ప్రయోజనాలను మే 30న బాధిత పిల్లలకు అందించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.