మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసింది. 2015-16లో కోల్కతాకు చెందిన ఓ సంస్థతో జరిగిన హవాలా లావాదేవీల్లో మంత్రి ప్రమేయం ఉందని ఇడి ఆరోపిస్తోంది.
ఈ హవాలా ప్రక్రియ అనేది రెండు పార్టీలు తమ తరుపున స్థానిక ఏజెంట్లతో డబ్బు లావాదేవీలు జరపడంతో పాటు అధికారిక బ్యాంకింగ్ మార్గాల ద్వారా నిధులు మళ్లకుండా ఉంటాయి. 2017 ఆగస్టులో రూ. 1.62 కోట్ల మనీలాండరింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలపై సత్యేంద్ర జైన్తో ఆయన కుటుంబ సభ్యులిపై సిబిఐ కేసు నమోదు చేసింది.
సత్యేంద్ర ఆయన కుటుంబ సభ్యులు.. నాలుగు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి.. 2011-12లో 11.78 కోట్లతో పాటు 2015-16లో రూ. 4.63 కోట్ల మనీలాండరింగ్కు పాల్పడ్డారు. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇడి విచారణ ప్రారంభించింది.
కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ.. తమను వేధిస్తోందంటూ తెలంగాణ, బెంగాల్ ముఖ్యమంత్రులు కెసిఆర్, మమతా బెనర్జీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడుతున్న సమయంలో కేజ్రీవాల్ ఇలాకా మంత్రి అరెస్టు కావడం సంచలనం కలిగిస్తున్నది. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్టు కావడాన్ని బిజెపి, కాంగ్రెస్ స్వాగతీస్తూ ఆయన్ను మంత్రి వర్గం నుండి తొలగించాలని ఈ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.