కరోనా మహమ్మారి కాలంగా రెండేళ్లుగా విద్యాలయాలు సరిగ్గా పనిచేయక పోతూ ఉండడంతో పడవ తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎన్నడూ ఎరుగనంత తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2019లో జరిగిన పరీక్షల్లో 94.80శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడు అది దాదాపు 17.5శాతం తగ్గిపోయి… 67.26 శాతంగా నమోదైంది.
సోమవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తూ కరోనా వల్లే ఉత్తీర్ణత శాతం తగ్గిందని చెప్పారు. 2021-22 విద్యా సంవత్సరానికి 6,20,788 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 6,15,908 మంది హాజరయ్యారు.
వీరిలో 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించగా 2,01,62 మంది ఫెయిలయ్యారు. 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత పొందలేదు. ఇందులో 31 ప్రైవేట్, 18 ఎయిడెడ్ పాఠశాలలు ఉనాుయి. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించడంతో 2020, 2021 సంవత్సరాల్లో పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేసిన సంగతి తెలిసిందే.
2020వ సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాశారు. ఆ రెండు సంవత్సరాలు కూడా వారు ఆన్లైన్ చదువులకే పరిమితమైనారు. ఈ విద్యా సంవత్సరంలోనూ బడులను ఆలస్యంగా తెరిచారు. పాఠశాలలు తెరుచుకున్నా తల్లితండ్రులు, విద్యార్థుల్లో భయాందోళనలు కొనసాగాయి. విద్యాబోధన కూడా అంతంతమాత్రంగానే సాగింది.
ఈ నేపధ్యంలో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో 20 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా అతి తక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. ఫెయిలైన విద్యార్థులకుజులైలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, రెగ్యులర్ విద్యార్థులతో పాటే చదువకునే అవకాశం కల్పిస్తామని మంత్రి చెప్పారు. అయినా, పాలిటెకిుక్, ఎపిఆర్జెసి వంటి అవకాశాలను ఫెయిలైన విద్యార్థులు కోల్పోయే పరిస్థితి నెలకొంది.
పాస్అయిన విద్యార్థుల్లో బాలికలు పై చేయి సాధించారు. బాలికలు 70.70 శాతం, బాలురు 64.02 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు తక్కువగా ఉండడానికి కరోనా ఒక కారణమైనా ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపించడం, ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండడం ప్రధాన కారణంగా పలువురు భావిస్తున్నారు.
ప్రధానోపాధ్యాయులను విద్యార్థుల చదువుపై దృష్టి సారించే అవకాశం ఇవ్వకుండా, వారికి మరుగుదొడ్ల శుభ్రత, మరుగుదొడ్లు ఫొటోలు తీయడం, మధ్యాహ్న భోజనం ఫొటోలు తీయడం, హాజరు ఫొటో తీయడం…ఇలాంటి పలు యాప్లతోనే సరిపోయింది. ఇక విద్యార్థుల అభ్యసన, వారి మార్కులపై దృష్టిపెట్టే సమయమే లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు ఉపాధ్యాయుల కొరత కూడా కొంత కారణమే. వేల సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలున్నా ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీంతో ఉన్నత తరగతుల్లో సరిపడా సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇది బోధనపైనా ప్రభావం చూపిందంని చెబుతున్నారు. కరోనా పరిస్థితుల అనంతరం ప్రారంభమైన విద్యాసంవత్సరంలో కీలకమైన పదో తరగతి విద్యార్థులపై ప్రభుత్వం పెట్టాల్సి నంతగా దృష్టి పెట్టలేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.